ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీల పేలుడు కారణంగా 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.భద్రతా ఏజెన్సీలు మావోయిస్టులు కదలికలతో పాటు ఐఈడీలు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న తర్వాత,కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించగా,ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో జవాన్లు గాయమయ్యారు.గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రాయ్పుర్కు తరలించారు.వీరిలో 9 మంది డీఆర్జీ సిబ్బంది,మరొకరు కోబ్రా బెటాలియన్కు చెందినవారు.
గతేడాది దేశంలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్
గాయపడ్డ భద్రతా సిబ్బందికి ప్రాణాలపై ముప్పు లేదు అని అధికారులు తెలిపారు.
ఈ ఘటన తర్వాత కర్రెగుట్ట ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి, కూంబింగ్ ఆపరేషన్లను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.గతేడాది ఇదే ప్రాంతంలో 21 రోజుల పాటు దేశంలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.


