విజయవాడ : హెల్ప్ ది హోప్ లెస్ స్వచ్చంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో 26-08-2022 ఉదయం 11 గంటలకు KL రావు పార్క్ రోడ్డులో సెయింట్ మదర్ థెరిస్సా గారి 112వ జయంతి కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాల వేసినారు..మదర్ థెరిస్సా సేవలను ఎంతో గొప్పవని కొనియాడినారు,విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు జ్యోతి ప్రజ్వలన చేసినారు.
ఈ కార్యక్రమంలో MLC,MD.రుహుల్లా గారు, YSRCP నగర ప్రధాన కార్యదర్శి రాయన నరేంద్ర గారు,YSRCP స్టేట్ యూత్ జనరల్ సెక్రెటరీ కర్నాటి రాంబాబు గారు,కొత్తపేట అగ్నిమాపక అధికారి T.శ్రీనివాసరావు గారు SFO గారు,AP NGO నాయకులు జిల్లా.దుర్గారావు గారు,YSRCP నాయకులు కనపర్తి శ్యామ్ కుమార్ గారు,రాష్ట్ర YSRCP SC సెల్ నాయకులు బొబ్బిలి లీలా కుమార్ గారు,రాష్ట్ర YSRCP SC సెల్ నాయకులు ఆదిరాల విజయ్ కుమార్ గారు, పూలె-అంబేద్కర్ రాజ్యాధికార సమితి AP స్టేట్ కో ఆర్డినేటర్ నమ్మి అప్పారావు గారు,సేవాసంస్థ అధ్యక్షులు ఈదులూరి రాధాకృష్ణ పాల్గొన్నారు…