Homeజాతీయం'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా సస్పెన్షన్.. రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు

‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఎక్స్ ఖాతా సస్పెన్షన్.. రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి చెందిన అధికారిక ఎక్స్ (X) ఖాతా నిలిపివేత వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తమ పార్టీ ఖాతాను ఎలాంటి సరైన కారణం లేకుండా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు.

తదుపరి విచారణ జులై 7కు వాయిదా
పార్టీ అధికారిక ‘X’ ఖాతా నిలిపివేయడం వల్ల ప్రజలతో కమ్యూనికేషన్ దెబ్బతింటోందని, పార్టీ కార్యకలాపాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోర్టుకు తెలిపారు.ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఖాతాను తక్షణమే రీస్టోర్ చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఖాతా నిలిపివేతకు సంబంధించిన పూర్తి వివరణ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేస్తూ, అప్పటిలోపు కేంద్ర ప్రభుత్వం, ఎక్స్ సంస్థ తమ సమాధానాలు దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు