- Advertisement -
మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య
విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో రెగ్యులర్గా 43 మంది పారిశుద్ధ్య కార్మికులకు 2023-24, 2024-25 కు సంబంధించిన రెండు సంవత్సరాలకు సబ్బులు, కొబ్బరినూనె మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు సద్వినియోగం చేసుకొని పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీలు ఆంజనేయులు, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.


