Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కిమ్స్ హాస్పిటల్ అద్వర్యంలో ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన

విశాలాంధ్ర ..నాగులుప్పలపాడు : మండలంలోని నాగులుప్పలపాడు గ్రామ సాయిబాబా మందిరంలో కిమ్స్ హాస్పిటల్, ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బుధవారము నిర్వహించారు. ఈ శిబిరం నందు ఉచితంగా మందుల పంపిణీ, కంటికి సంబంధించిన పరీక్షలు ,ఈసీజీ బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. గుండె కిడ్నీ విష జ్వరాలు లాంటి వ్యాధులకు వైద్యులు , పేషంట్లకు డాక్టర్లు తగు జాగ్రత్తలు తెలిపారు. రోగ నిర్ధారణ జరిగిన పేషంట్లకు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ ,ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 మందికీ వైద్యపరిక్షలు నిర్వహించారు అని డాక్టర్లు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ రామాంజనేయులు, ఆప్తమాలజిస్ట్ సునీల్, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img