విశాలాంధ్ర`పెద్దకడబూరు : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపిఓ రామన్న ఆధ్వర్యంలో మంగళవారం సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎస్ఐ పాస్టర్ మనోహర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెమి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాస్టర్ మాట్లాడుతూ లోక కళ్యాణ నిమిత్తం యేసుక్రీస్తు లోకంలో మనుష్య కుమారునిగా జన్మించారని తెలిపారు. యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల ఎడల ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి చ్కెర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, వైస్ ఎంపీపీ పరమేష్, ఎంపీడీఓ వెంకట రమణప్ప, ఏపిఓ రామన్న, నాయకులు గజేంద్ర రెడ్డి, పూజారి ఈరన్న, తిక్కన్న, ముక్కరన్న, అర్లప్ప, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.