Homeఆంధ్రప్రదేశ్తిరుపతి ఎస్పీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: వైసీపీ నేతలపై కేసు

తిరుపతి ఎస్పీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: వైసీపీ నేతలపై కేసు

- Advertisement -

తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురు నేతల పేర్లను చేర్చారు. వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అంశాలపై ఎస్పీకి వినతిపత్రం సమర్పించేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అయితే, నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు కార్యకర్తలు అంగీకరించకపోవడంతో ఎస్పీ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ (ఎస్‌వీయూ) పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళిరెడ్డి, చెవిరెడ్డి రఘుతో పాటు మరో 30 మందికి పైగా వ్యక్తులపై పోలీస్ విధులకు ఆటంకం కల్గించారన్న అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు