Homeఆంధ్రప్రదేశ్జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0 పోటీలు..

జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0 పోటీలు..

- Advertisement -

పోస్టర్‌ను ఆవిష్కరించిన శాప్‌ ఛైర్మన్,ఎండీ
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని శాప్‌ (SAAP) ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు తెలిపారు.ఈ క్రమంలో జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0 పోటీలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని శాప్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో శాప్‌ ఎండీ ఎస్‌. భరణి, భారత హాకీ క్రీడాకారిణి ఎతిమరుపు రజని, అంతర్జాతీయ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపితో కలిసి రవినాయుడు ఃఅమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0ః పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మూడు లక్షల మంది క్రీడాకారులు
ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అండర్‌-17, అండర్‌-23 విభాగాలకు చెందిన క్రీడాకారుల కోసం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయి, ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లా స్థాయి, ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు మొత్తం రూ.94 లక్షల నగదు బహుమతులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో సుమారు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొనేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

విజేతలకు నగదు బహుమతులు
అలాగే ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని రవినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్‌ ఎండీ ఎస్‌. భరణి, హాకీ క్రీడాకారిణి ఎతిమరుపు రజని, చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తదితరులు కూడా పాల్గొని క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, క్రీడాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు