- Advertisement -
న్యూఢిల్లీ:
దేశంలో వార్తాపత్రికలు, మ్యాగ జైన్లు, పీరియాడికల్స్ ప్రచురణకర్తల సంఘం ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్)కి 2026–27 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మాత్) ఎన్నికయ్యారు. 67వ వార్షిక సర్వd Ÿభ్య సమావేశంలో ఆయన ఎన్నికను ప్రకటించారు. ఐఎన్ఎస్ ఉపాధ్యక్ష లుగా తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా), హర్ష మ్యాథ్యూ (వనిత), గౌరవ ట్రెజరర్గా అనంత్నాథ్ (గృహశ్ఙోóక) ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్గా మేరీ పాల్ కొనసాగనున్నారు. మరోవైపు 41 మందితో కూడిన ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో కేఆర్పీ రెడ్డి (సాక్షి), ఐ.వెంకట్ (ఈనాడు) తదితరులున్నారు.


