నేటి నుండి ఆన్ లైన్ లో గ్రూపు 2 మెయిన్ హాల్ టికెట్లు
ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్ పరీక్షలు
రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ ఉ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు హాల్టికెట్లు గురువారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ. నరసింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు గురువారం నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. తొలుత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఈ ఏడాది జనవరి 5న నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఆ మేరకు పరీక్ష తేదీని ఖరారు చేసింది. అయితే సిలబస్ మార్పుతో పాటు, సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో పరీక్ష తేదీని ఫిబ్రవరి 23కి మార్చింది. గత ప్రభుత్వం హయాంలో 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుకు జనవరి 10, 2024 చివరి తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 25, 2024న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. గ్రూప్ ఉ 2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. చివరికి ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
RELATED ARTICLES