Saturday, May 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమంచి క్రమశిక్షణతో కూడిన విద్య, భవిష్యత్తులో మంచి గుర్తింపును తెస్తుంది..

మంచి క్రమశిక్షణతో కూడిన విద్య, భవిష్యత్తులో మంచి గుర్తింపును తెస్తుంది..

యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ
విశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తులో మంచి గుర్తింపును తెస్తుంది అని యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ అధ్యక్షులు మాలగుండ్ల మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి కప్పల బలరాముడు, కోశాధికారి బండి ఉజ్జినప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట లో గల యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపంలో పదవ తరగతి, ఇంటర్ ఆపై ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులకు పురస్కార నగదు, అవార్డుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుబ లస్తులకు చదువులో మంచి ప్రతిభను కనపరచడం పట్ల వారు తొలుత విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పదవ తరగతిలో మొత్తం 38 మందికి, ఇంటర్మీడియట్ లో 18 మందికి, జె ఈ ఈ మెయిన్స్ లో గిరక కావ్య కు పురస్కార అవార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో అధికమార్కుల సాధించిన విద్యార్థులకు ప్రధమ నగదు బహుమతి రూ.3000,ద్వితీయ 2500, తృతీయ 2000 రూపాయలు ప్రకారం నగదు పురస్కారంతోపాటు మెమొంటోలు కూడా పంపిణీ చేశారు. ఈ నగదు పురస్కారానికి దరఖాస్తులు చేసుకున్న మిగిలిన వారందరికీ కూడా 1000 రూపాయలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశామని తెలిపారు. తదుపరి పదోన్నతి పొందిన నాన్ టీచింగ్ ఉద్యోగ ఉపాధ్యక్షులు దాసరి నాగముని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ డైరెక్టర్ కమతం కాటమయ్య, గౌరవ ఉపాధ్యక్షులు మాలకొండ రవీంద్ర, ఉపాధ్యక్షులు కోటి వెంకటేశులు, కోశాధికారి పాముల విజయభాస్కర్, గిరక నారాయణస్వామి, గవ్వల బాబు, గవ్వల నారాయణస్వామి తోపాటు డైరెక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు