కరస్పాండెంట్ మల్లికార్జున
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద స్కూల్లో వార్షిక క్రీడా సమావేశాలు ఘనంగా నిర్వహించుకున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున డైరెక్టర్ రవీంద్ర, పృధ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో భాగంగా పిల్లలకు గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా విద్యార్థులచే చేయించిన పిరమిడ్స్, డ్రిల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాలలో చదువుతోపాటు స్పోర్ట్స్ కూడా చాలా అవసరమని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అనూప్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేశారు.
ఘనంగా యశోద స్కూల్లో వార్షిక క్రీడా సమావేశం…
- Advertisement -
RELATED ARTICLES


