విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ టూరిజం ఆస్తులను ప్రవేటు పరం చేయడాన్ని వెంటనే ఆపాలని ఎఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఏపీ టూరిజం శాఖ కొసం ప్రభుత్వం కొన్ని వేల కోట్లరూపాయలు ఖర్చు చేసిందని ఏపీ టూరిజం ఆస్తులు దాదాపు 10 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయన్నారు. ఆస్తులను ప్రవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇందులో పనిచేస్తున్న 1000 మంది కి పైగా ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు . శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రవేట్ కు అప్పచెప్పారని ప్రభుత్వం ఏపీ టూరిజం శాఖ ను ప్రవేట్ కు అప్పచెప్పె ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ టూరిజం ఆస్తులను ప్రవేటు పరం ఆపాలి .. ఎఐటియుసి
- Advertisement -
RELATED ARTICLES


