- Advertisement -
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత.
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తుమ్మల గ్రామపంచాయతీ పరిధిలోని మల్లేనిపల్లి గ్రామం నందు ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు పైన తెలిపిన ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు ఒక్కొక్కరు రెండు సెట్స్ అప్లికేషన్లు పీహెచ్సీ దర్శనమల మెడికల్ ఆఫీసర్ కు జులై 4వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు.


