- Advertisement -
విశాలాంధ్ర – కొవ్వూరు : నిత్యం బ్యాంకు అభివృద్ధి మీదే ధ్యాస.. అదే ఆయనకు అవార్డు తెచ్చిపెట్టింది. బాధ్యతలు నిర్వహణలో ఆయనకు ఎప్పుడూ బ్యాంకు అభివృద్ధి పైనే ధ్యాస. ఆయన సేవలకు గుర్తింపు గా ప్రభుత్వం అవార్డును అందజేసింది. కొవ్వూరు అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ కు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకలలో రాష్ట్ర మంత్రి దుర్గేష్ , జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా అవార్డు లభించింది. ఈ నేపద్యంలో ఖాతాదారులు బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు


