బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఛాత్ పూజా సంబురాలు ముగిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలనే యోచనలో ఉన్న ఈసీ.. నవంబర్ 5 నుంచి 15 వరకు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలోలానే ఈ సారి కూడా మూడు దశల్లో ఎలక్షన్లను నిర్వహించనున్నట్లు ఇండియా టుడే వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీహార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.


