- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా శరన్నవరాత్రులలో భాగంగా తొలిరోజు సోమవారం ఆదిలక్ష్మీ గా భక్తులు కు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు మయూరం బాలాజీ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు మంగళవారం గజలక్ష్మీగా ఉద్భవలక్ష్మీ అమ్మవారు. భక్తులకు దర్శన మిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.


