Wednesday, February 5, 2025
Home Blog Page 129

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించండి

ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన సునీత, శ్రీరామ్

ఇరిగేషన్, విద్యుత్, దేవాదాయశాఖల వారిగా విజ్ఞప్తులు
విశాలాంధ్ర ధర్మవరం : రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో పాటు జలవనరులు, దేవాదాయ, విద్యుత్, పర్యాటక, గనుల శాఖల మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి జాకీ పరిశ్రమ ఏర్పాటు, నడిమివంక రక్షణ గోడనిర్మాణం, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేసిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని నడిమివంక రక్షణ గోడ నిర్మాణానికి, నియోజకవర్గంలో ప్రాజెక్ట్ ల పనుల గురించి వివరించారు. పేరూరు ప్రాజెక్టు కు నీరందించే పనులు అలాగే గేట్ల మరమ్మతులు వంటి వాటిపై విజ్ఞప్తి చేశారు. పీఏబిఆర్ కుడి కాలువ ద్వారా 53 చెరువులకు నీరందించాలన్నారు. అలాగే హెచ్చెల్సీ ద్వారా పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు విడుదల చేయాలని,ఈ కాల్వ నుంచి తాడిమర్రి మండలంలోని చివరి చెరువు వరకు నీరు అందేలా చూడాలన్నారు. ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ ప్రాజెక్టు పనులు నిలిపివేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చి రైతులకు ఉపయోగకరంగా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. మరోవైపు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలసి ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలలో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు కూడా మంజూరు చేయాలని వారు తెలిపారు. స్పందించిన విద్యుత్ శాఖ మంత్రి సీఎండీకి ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని కలిసి పలు గ్రామాలు తోపాటు ఎస్సీ ఎస్టీ కాలనీలలో దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని తిరుమలేశ్వర ఆలయంలో దుర్గాదేవి ఆలయానికి మెట్ల ఏర్పాటు 50 లక్షలతో స్నేక్ బార్ మరుగుదొడ్లను నిర్మించాలని వారు కోరారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కూడా వారు కలిసి ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యాటకరంగా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తిరుమల దేవర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పర్యాటక సౌకర్యాల అభివృద్ధి ఎన్ హెచ్ 44 అనంతపురం సమీపంలోని మరో టోల్గేట్ వద్ద 25 లక్షలతో స్నేక్ బార్ నిర్మాణము ఆత్మకూరు జాతీయ రహదారి సమీపంలో టూరిజం వే సైడ్ సౌకర్యాలు నసనకోట ముత్యాలమ్మ గుడి దగ్గర పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా టూరిజం రెస్టారెంట్ మరుగుదొడ్లు నిర్మించాలని తెలపడం జరిగిందని తెలిపారు. చెన్నై కొత్తపల్లి మండలం కోన శివాలయం వద్ద పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా టూరిజం రెస్టారెంట్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలని తెలపడం జరిగిందన్నారు. పేరు డ్యాం వద్ద బోటింగ్ అభివృద్ధి చేయాలని,తదుపరి భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి రామగిరి బంగారుగనులను మళ్లీ తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగిందని తెలిపారు. దీనివలన వందలాదిమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సమస్యలన్నింటిపై సంబంధిత మంత్రులు సానుకూలంగా స్పందించడం జరిగిందని పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని పనులు చేపడతామని మంత్రులు హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.

పుట్టపర్తి లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు గైకొనండి

ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్
విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు గైకొనాలని ఏపీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వైశాన్సులర్ కృష్ణయ్యకు వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న ప్రేమ్ సాయి అనే విద్యార్థి పై తోటి విద్యార్థులు దాడి చేయడం వల్ల ఆ విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు. మృతి చెందిన విషయం తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. కనీసం కళాశాలలో ఏమి జరుగుతోంది అన్న విషయాన్ని కూడా కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందడం జరిగిందని వారు ఆరోపించారు. కావున ఆ కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కళాశాలలో పోలీస్ టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్, ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై పర్యవేక్షణ జరపాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు తెలిపారు. సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మా పోరాటాలు ఆపమని తెలిపారు.

పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ధర్మవరం వారి సేవలు

విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో బాబా 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలోని గాంధీ నగర్ వారి శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ప్రశాంతి రైల్వే స్టేషన్ పుట్టపర్తి వెళ్లే వెయ్యి మంది భక్తాదులకు మధ్యాహ్నం భోజన ఏర్పాటును నిర్వహించడం జరిగిందని కన్వీనర్ నామప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 21 న, 22న, 23న (మూడు రోజులపాటు) భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది సేవా కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తాదులు శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

వృత్తి విద్య‌లో నైపుణ్యం సాధించాలి

0

విద్యుత్ ఏఈ ఆంజినేయ శాస్త్రి
వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : విద్యార్థులు చదువుతోపాటు వృత్తి విద్య‌లో నైపుణ్య‌త సాధించాల‌ని విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ ఆంజినేయ శాస్త్రి, ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారిలు అన్నారు. ఒకేషనల్ ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 33/11 కే.వి ఉప విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ ఎలా సరఫరా అవుతుందో, విద్యుత్తును ఎలా వినియోగించుకోవాలనే అంశాలతో పాటు విద్యుత్ సరఫరా అయ్యే వివిధ రకాల ట్రాన్స్ ఫార్మర్ల పరికరాల పనితీరు గురించి విద్యుత్ ఏఈ ఆంజినేయ శాస్త్రిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఈ ఆంజినేయ శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన ఇతర రంగాల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రస్తుత ఆధునిక యుగంలో విద్యార్థులు సాంకేతికంగా మరియు వృత్తి విద్య లోనూ నైపుణ్యం ప్రదర్శించాలని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వృత్తి విద్య కోర్సుల ద్వారా త్వరగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్య ఉపాధ్యాయుడు శివకుమార్, రాజు మరియు ఉపాధ్యాయులు ఆనంద్, బాబు, విద్యు సబ్ స్టేషన్ ఆపరేటర్ మల్లికార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.

షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసు: బాల‌కృష్ణ

గ‌న్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన బాల‌కృష్ణ‌
షర్మిలపై త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యలు
అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణ ఈరోజు ఉద‌యం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న… ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుస‌ని అన్నారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉంటే… న‌టుడు ప్ర‌భాస్‌తో త‌న‌కు ఎలాంటి రిలేష‌న్ లేద‌ని తాజాగా మ‌రోసారి షర్మిల స్ప‌ష్టం చేశారు. త‌న పిల్ల‌లపై ప్ర‌మాణ‌పూర్వకంగా ప్ర‌భాస్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. త‌న‌పై బాల‌కృష్ణ ఇంటి నుంచే త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింద‌ని జగన్ చెప్పారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారంటూ బాల‌య్య ఎద్దేవా చేశారు. ఇవాళ‌ కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంద‌ని తెలిపారు.

వైసీపీలో వాళ్లను వదలం..పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభంమైంది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఈరోజు పీఏసీ కమిటీకి ఎన్నిక కానుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేలు సంఖ్యా బలం అవసరం. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఆర్ఈజీ‌ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు.నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజలు పనిని కల్పిస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.

చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 5400 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ సర్వనాశనం: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

గ్రామీణ ప్రాంతంలో పేదల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే పథకం ఇదని తెలుగుదేశం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. 70 నుంచి 80శాతం జాబ్ కార్డులు ఉన్నవారికి 100 దినాలు పనిని కల్పించాలని చెప్పారు. 10శాతం దాటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 రోజులు పని లభించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చివరకు ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్లను కూడా మూసివేశారని మండిపడ్డారు. అరటికి, కొబ్బరి, కొకొ, వక్కకు ఇస్తే పనిదినాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. గుర్రపుడెక్క తీసుకున్నే అవకాశం ఇస్తే పనిదినాలు పెరుగుతాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొ్న్నారు.

22 శాఖల్లో ఎంతమేర బకాయి: పత్తిపాటి పుల్లారావు

ఎన్ఆర్ఈజీఎస్ గతంలో 22 శాఖలతో అనుసంధానం అయి ఉంటుందని తెలుగుదేశం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 22 శాఖల్లో ఎంతమేర బకాయి ఉంది. వైసీపీ ఐదేళ్లుగా జీతాలు ఆపేయడం వల్ల 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గతంలో శ్మశాన వాటికలకు ఎన్ఆర్ఈజీఎస్‌లో ఉండేదని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

అదానీ దేశం, జగన్ ఏపీ పరువు తీసేశారు.. షర్మిల

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీసేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అమెరికాలో గౌతమ్ అదానీ బండారం బట్టబయలవడం.. దేశానికే అవమానమన్నారు. అదానీ కేసులో జగన్‌ లంచం తీసుకున్నట్టు స్పష్టంగా ఉందన్నారు. జగన్‌ అమెరికాకు డైరెక్ట్ ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేనందునే ఆరోపణల్లో జగన్‌ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు.

లంచాల కోసం ప్రజలను తాకట్టుపెట్టడం దారుణం అన్నారు. ఒక్క సోలార్ ప్రాజెక్టలోనే అదానీ రూ.17 వందల కోట్లు ఇచ్చారంటే.. మిగిలిన ప్రాజెక్టుల్లోనూ ఇంకెంత లంచం ముట్టిందో అని మండిపడ్డారు. విశ్వసనీయత అనే పదానికి అర్ధం తెలుసా అని షర్మిల ప్రశ్నించారు. జగన్‌ నిర్వాకం వల్లే డిస్కంలు అప్పుల ఊబిలోకి చేరాయి అన్నారు. జగన్ విధానాలతో ప్రజలపై రూ.17 వేల కోట్ల భారం పడిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.

అదానీతో ఒప్పందం చేసుకోలేదు.. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: వైసీపీ

భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ. 2,100 కోట్లు లంచంగా ఇచ్చారంటూ అదానీతో పాటు 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత ఏపీ ప్రభుత్వాధినేతకు రూ. 1,750 కోట్లు లంచంగా ఇచ్చారని కేసులో పేర్కొన్నారు. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా స్పందించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని… అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కమ్ లు ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఉచిత విద్యుత్ ను రైతులకు అందించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్ ను అత్యంత చౌకగా యూనిట్ కు రూ. 2.49 చొప్పున 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్ లు ఒప్పందం చేసుకున్నాయని తెలిపింది. చంద్రబాబు అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల యూనిట్ ధర రూ. 5.10కి చేరిందని… ఇది డిస్కమ్ లపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సోలార్ పార్క్ లను అభివృద్ధి చేయాలని 2020లో ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపింది. అంతర్రాష్ట్ర విద్యుత్ ఛార్జీలను మినహాయించి యూనిట్ రూ. 2.49 చొప్పున విద్యుత్ సరఫరా చేసేందుకు సెకీ ప్రతిపాదించిందని… అదే ధరతో 25 ఏళ్ల పాటు 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ. 3,700 కోట్ల మేర ఆదా అవుతుందని… 25 ఏళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుందని తెలిపింది.

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై స్పీక‌ర్ దే నిర్ణ‌యం.. హైకోర్టు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానంద్ లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.

మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

తెలంగాణ‌ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవ‌లే మాజీమంత్రి కేటీఆర్‌, నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంత‌రకర వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆమె వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో కాల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ యువతితో సురేఖ మట్లాడుతూ… ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తున్నాం.. చిన్న పాప పేరు తోటి. మా టీమ్‌ టీమంతా కూడా ఇవాళ ఫుల్‌ ఎంజాయ్‌. బిర్యానీ ఉంటే బీర్‌ ఉంటది కదమ్మా పాపం. అఫీషియల్‌ సెలేబ్రేషన్‌ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇక‌ అన్‌అఫీషియల్‌గా అంటే.. అన్నారు. అలాగే మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్‌ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్ప‌డం ఉంది. అయితే ఈ వీడియోల‌ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. దీంతో కొండా సురేఖపై నేటిజన్లు మండిప‌డుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి… ఇలా బీరు బిర్యానీ పార్టీ చేసుకోవడం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు.