Wednesday, February 5, 2025
Home Blog Page 136

రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ధర్మవరం బాల బాలికలు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర స్థాయిలో ఈ నెల నవంబర్ రెండవ తేదీ నుండి నాలుగో తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( ఎస్ జి ఎఫ్)రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో లో పాల్గొనే అండర్ 14 విభాగంలో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో.. బి. యశస్విత,అలాగే బాలుర విభాగంలో బి. శశిధర్ కుమార్… బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు . రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి, ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.

ఆ ఐదు గ్రామాలకు సాగునీరివ్వండి

అనంతపురం జిల్లా కలెక్టర్ కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు రావడం లేదు

ఐదు గ్రామాల్లో తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడి ఉందన్న శ్రీరామ్

సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు విడుదల చేయకపోవడం వలన ఐదు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్రమైన తాగు, సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా ఇదే అంశం పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి వినతి పత్రాన్ని అందజేశారు. పరిటాల శ్రీరామ్ తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామస్థులతో కలసి కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ ని కలిసి నీటి సమస్య గురించి వివరించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ హెచ్చెల్సీ కాలువకు అనుబంధంగా ఉన్న పులివెందుల బ్రాంచి కెనాల్ కు గత కొన్ని సంవత్సరాలుగా నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీఆర్ డ్యాం సౌత్ కెనాల్ మీదుగా ఉన్న తుంపెర డీప్‌కట్ సమీపంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఆఫ్‌టేక్ పాయింట్ ఉందన్నారు. డీప్‌కట్‌లో 6కి.మీ నడిచిన తర్వాత కాలువ నదిలో కలుస్తుందన్నారు. చివరకు పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు వలన ప్రయోజనం ఉంటుందని పీబీసీకి నీరు అందినప్పుడల్లా డీప్‌కట్‌ ప్రాంత రైతులు బోరుబావుల సాయంతో ఆయకట్టును సాగు చేస్థున్నారన్నారు. కానీ గండికోట – చిత్రావతి లిఫ్ట్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత 2018 నుండి హెచ్‌ఎల్‌సి సిస్టమ్ నుండి పిబిసికి నీటిని పూర్తి సామర్థ్యంతో విడుదల చేయడం లేదన్నారు. ఐడిసి స్కీమ్‌లకు మాత్రమే మైనర్ డిశ్చార్జెస్‌తో నీటిని విడుదల చేస్తున్నారని.. దీని వలన రైతులకు సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిమర్రి మండలం రామాపురం, కునుకుంట్ల, చిలకొండయ్య పల్లి, నార్పల మండలం గుగూడు ముచ్చుకుంటపల్లి గ్రామస్తులు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల అవసరానికి తీర్చడానికి ఎర్ట్స్ వైల్ పిబిసి కెనాల్ నుండి తగినంత ఎక్కువ నీటిని కేటాయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులపై ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారం తీసుకొని ఉన్నత స్థాయిలో చర్చించిన తర్వాత ఐదు గ్రామాలకు నీరు అందేలా కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి..

ట్రాఫిక్- ఎస్ఐ. వెంకటరాముడు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాలు జరగవు అని ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరాముడు తెలిపారు. ఈ సందర్భంగా పలు ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమైన కూడలిలలో ద్విచక్ర, కార్లు ఇతరత్రా వాహనాలు నిలపరాదని, అలా నిలిపితే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై తీసుకోవలసిన జాగ్రత్తలను పట్టణంలోని ఆటో డ్రైవర్లకు వ్యాన్ డ్రైవర్లకు తగిన సూచనలు ఇస్తూ అవగాహనలు కూడా కల్పించడం జరుగుతోందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే ఎవ్వరూ కూడా వాహనాలు నడపరాదని తెలిపారు. మైనారిటీ కు చెందిన వారికి వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా కట్టడి చేయాలని తెలిపారు. పట్టణములో ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానాలు తప్పవని వారు హెచ్చరించారు. పట్టణంలో వాహనాలు వేగంగా వెళ్లరాదని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలకు కళాశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. ఎందుకనగా నియమ నిబంధనలు తెలియకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినప్పుడే సుఖవంతమైన ప్రయాణంతో పాటు ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఉన్న సిబ్బందితో ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా దుకాణాల వద్ద గంటలు తరబడి వాహనాలు ఉంచరాదని, దీనివల్ల ట్రాఫిక్కుకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున దుకాణాదారులు తమ షాపు వద్ద పార్కింగ్ ఉండకూడదని వారు తెలిపారు. అతివేగం అమిత ప్రమాదమని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందని తెలిపారు. కావున ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి, ప్రమాదాలు లేకుండా పట్టణ రహితగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

రుణాల మంజురు లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాల మంజురు లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఇందుకు జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ లో ఉన్న డి.పి.ఆర్.సి భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించాలని, ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. కొద్ది రోజుల కింద నగరంలోని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో ప్రధానమంత్రి సూర్యఘర్ మేళా నిర్వహించడం జరిగిందని, అలాగే కలెక్టరేట్లో పిఎమ్ఈజీపి, స్టాండప్ ఇండియా, తదితర పథకాల కింద రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు లబ్ధిదారులకు రుణాలు అందించడం జరిగిందని, ఇందులో బాగా పనిచేసిన బ్యాంకర్లను, ఎల్డీఎంని అభినందించారు. మెప్మా కింద ఎస్.హెచ్.జి బ్యాంకు లింకేజ్ కి సంబంధించి జిల్లాకు 2,010 ఎస్.హెచ్.జిలకు బ్యాంకు లింకేజ్ చేయాలని లక్ష్యం విధించగా, అందులో గత సెప్టెంబర్ వరకు 1,005 ఎస్.హెచ్.జిలకు బ్యాంకు లింకేజ్ చేయాల్సి ఉండగా, 1,441 బ్యాంకు లింకేజ్ చేయడం జరిగిందని, 143.38 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది కేటాయించిన లక్ష్యానికి మించి మరింత ముందుకు వెళ్లి బ్యాంకు లింకేజీలు చేపట్టాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద గతేడాది 30 శాతం, ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మాత్రమే రుణాలు ఇవ్వడం జరిగిందని, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులకు ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయా పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు నిత్యం సమీక్ష నిర్వహించాలని ఎల్డీఎం, జిల్లా అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ పథకాలు మొదలయ్యే అవకాశం ఉందని, జిల్లా అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం బాగా ఉంటే పథకాల గ్రౌండింగ్ మరింత పెరుగుతుందన్నారు. ఎల్డీఎం, డిఆర్డిఏ పిడి, మెప్మా పీడీలు బ్యాంకర్లతో 7 రోజుల్లోగా సమావేశాలు నిర్వహించి కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఏడు మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్ చేయడం జరిగిందని, ఆయా మండలాల్లో ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడం చేయాలని, కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. రుణం తిరిగి చెల్లించడం చేయకపోయినా కొత్త రుణాలు ఇవ్వవచ్చన్నారు. హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకునేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు 35 వేల రూపాయల చొప్పున రుణాలు అందజేయాలని డిఆర్డిఏ పిడికి సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు 90 శాతం పూర్తయి ఉన్న రెండు గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయాలని, జిల్లాలో 577 గ్రామ పంచాయతీలు ఉండగా, ఆయా పంచాయతీలలో అన్ని ప్రభుత్వ పథకాల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రామ పంచాయతీలు చొప్పున జిల్లాలో 100 వరకు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుని ముందుగా ప్రభుత్వ పథకాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను సమన్వయంతో పనిచేయడం ద్వారా వాటిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొని, పథకాల అమలులో పురోగతి తీసుకువచ్చేలా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎల్.డి.ఎం నర్సింగ్ రావు, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, నాబార్డు ఏజిఎం అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ జెడ్ఎం శ్రీధర్, ఫిషరీష్ డిడి శ్రీనివాసనాయక్, డీపీఓ నాగరాజునాయుడు, ఎస్సి కార్పొరేషన్ ఈడీ సారయ్య, మెప్మా పిడి విశ్వజ్యోతి, వివిధ బ్యాంక్ సీఈఓలు, మేనేజర్లు, బ్యాంకర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కోర్టు తీర్పును ధిక్కరిస్తూ రైతులకు నోటీసులు జారీ చేసిన వీఆర్వో పై చర్యలు తీసుకోవాలి

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కోర్టు తీర్పును ధిక్కరిస్తూ రైతులకు నోటీసులు జారీ చేసిన వీఆర్వో సురేష్ పై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం పెద్దకడబూరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం నాయకులు మబ్బు ఆంజనేయ, సిపిఐ పార్టీ సభ్యులు రాజు, ఏఐవైఎఫ్ మంత్రాలయం అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో సర్వేనెంబర్ 177/1 174/3 174/1 177/3a 177/3ప గల భూమిలో గతంలో పేద రైతులు అనుభవంలో ఉన్నారన్నారు. పెత్తందారులైన ఓకే వీరేష్, లక్ష్మన్న లు రైతులను భయాందోళన గురి చేసి రైతులను బెదిరించడం జరిగిందన్నారు. ఈ విషయంపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉద్యమాలు , పోరాటాలు తర్వాత ఈ భూమి RశీR కేసు కూడా అయినట్లు తెలిపారు.వారి కుటుంబ సభ్యుల పేర్లు మీద ఉన్న డాక్యుమెంట్లు డూప్లికేట్ డాక్యుమెంట్లు అని ఆనాడే సబ్ కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వాళ్ల పేర్లు కూడా తొలగించాలని ఆదేశించారని తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా వీఆర్వో బీటీ సురేష్ కోర్టు కేసు ఉన్నా కూడా పెత్తందారులతో కాసులకు కక్కుర్తి పడి పేద రైతులకు నోటీసులు ఇచ్చి పెత్తందారులకు అడుగులకు మడుగులొత్తుతున్న వీఆర్వో సురేష్ ని వెంటనే సస్పెండ్ చేయాలని కోర్ట్ కేసులు ఉన్నా కూడా చట్టామంటే ఆయనకు లెక్క లేదు కాసులొస్తే చాలు అనుకున్న విఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ శ్రీనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, నాగిరెడ్డి, రమేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించండి

జిల్లా వైద్యానికి శాఖ అధికారి ఈ. బి. దేవి కి ఏపీ హంస నాయకుల వినతులు

విశాలాంధ్ర- అనంతపురం : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల సిబ్బంది సమస్యల గురించి అనంతపురం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవికి ఏ పి హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి షఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. వేణుగోపాల్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జీవో నెంబర్ 143 మరియు 32లను రద్దు చేసి రీడిప్లాయిమెంట్ రద్దు చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాల్లో పనిచేయుచున్న ఏ.ఎన్.ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ విధులకు మాత్రమే కేటాయించి, ఇతర విధులను రద్దు చేయాలన్నారు. ఎన్. హెచ్. యమ్ ఉద్యోగులు ఎఫ్ ఆర్ ఎస్ ఆధారంగా కోత విధించిన జీతాలను వెంటనే మంజూరు చేయాలని ఎఫ్ ఆర్ ఎస్ ఆధారిత కాకుండా జీతాలు ఇవ్వాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేయుచున్న ఏ.ఎన్.ఎంలకు సూపర్వైజర్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు,ఫార్మసిస్ట్‌లకు స్టాఫ్ నర్సులకు, యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వార్డు సచివాలయాలు మరియు గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఏ.ఎన్‌.ఎంలకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలన్నారు.
పి.హెచ్. సిలలో లబోరేటరి 63 రకాల పరీక్షలు పరీక్షలు చేయడానికి తగిన ఇన్‌ఫ్రాస్ట్రాక్షర్ కల్పించాలి.ప్రతి పి.హెచ్‌.సికి,ల్యాబ్‌లకు రిఫ్రిజిరేటర్ వెంటనే సప్లై చేయాలన్నారు. జిల్లాలో క్యాడర్‌లో పని చేస్తున్నా అన్ని క్యాడర్ లకు సంబంధిశీచి సీనియార్టీ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రతి పి.హెచ్‌.సికి కావాలసిన
అన్ని రకాల రిజిస్ట్‌లను వెంటనే సప్లయి చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ల్యాబ్ కు సంబందించి తగిన ఇన్‌ఫ్రాస్ట్రాక్షర్ కల్పించాలన్నారు. వైద్య సిబ్బందిపై యాపులు ఒత్తిడి తగ్గించాలన్నారు.వైద్య సిబ్బందిపైసెలవుల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలన్నారు. జిల్లా లోని వైద్య సిబ్బందికి క్షేత్రస్థాయి పర్యటన చేయుటకు గాను ఎఫ్. టీ. ఏ లు మరియు టీ. ఏ బిల్లులు చేయాలన్నారు.
పై సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి డిమాండ్ తో కూడిన పత్రాన్నీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సిటీ యూనిట్ అధ్యకుడు కుళ్ళయి బాబు, కార్యదర్శి భక్తర్ అలీ, ఉపాధ్యక్షులు రవీంద్ర, ఈశ్వరయ్య, గిరిధర్ రెడ్డి, సింగనమల తాలూకా అధ్యక్షుడు నల్లప్ప ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహేంద్ర బాబు ,, లోకేశ్వర్ రెడ్డి, నూరి పర్వీన్, సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలు యు. రాముడు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు, చదరంగం , వకృత్వ పోటీలను నిర్వహించారు. ముందుగా స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బలుసు నాగేశ్వరరావు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క జీవిత చరిత్రను నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి జి శేఖర్, రాధాకృష్ణమూర్తి, సిరాజ్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

రంగుల కోసం రూ.101 కోట్లు ఖర్చు చేశారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మండలి సమావేశాలకు హాజరైన పవన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానమిచ్చారు.గతంలో సచివాలయాలకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు రూ.101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు రూ.49.8 కోట్లు… రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు.

కామన్ డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు

గ్రామాల్లో డంపింగ్ యార్డులపైనా శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జవాబిచ్చారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డు కోసం గ్రామాల్లో స్థల సేకరణ కష్టంగా ఉందని, డంపింగ్ యార్డుల సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 10 నుంచి 12 గ్రామాలకు కలిపి కామన్ గా డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

వ‌రల్డ్ సిఓపిడి డే


డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి
కన్సల్టెంట్ క్లినికల్

విశాలాంధ్ర- అనంతపురం : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది సిఓపిడి గురించి అవ‌గాహ‌న లేకుండా తీవ్ర‌మైన ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డ అలర్జీ స్పెషలిస్ట్ కిమ్స్ సవీర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సిఓపిడి వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న‌వారు ఎవ‌రు ? ఈ వ్యాధి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.
సిఓపిడి అంటే ఏమిటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) అనేది ఊపిరితిత్తుల నుండి వాయుప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పరేన్చైమా (అల్వియోలీ) మరియు రక్త నాళాల నాశనం/నష్టం క‌లిగిస్తుంది. ఊపిరితిత్తులు కాలక్రమేణా మరింత దెబ్బతినడంతో, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సిఓపిడి అనే పదం దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ (బ్రోన్చియల్ ట్యూబ్స్ యొక్క వాపు) మరియు ఎంఫిసెమా (గాలి సంచులకు నష్టం) కూడా కలిగి ఉంటుంది.
సిఓపిడి ఎంత సాధారణమైనది? ఇది ప్రమాదకరమా?
సిఓపిడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు మూడవ ప్రధాన కారణం మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ-ఆదాయ దేశాలలో మరణాలు సర్వసాధారణం. ప్రపంచంలో ప్రస్తుతం 384 మిలియన్ల సిఓపిడి కేసులు ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో సిఓపిడి భారం పెరుగుతుందని అంచనా వేయబడింది. ఏటా దాదాపు 30 లక్షల మంది మరణిస్తున్నారు.
ప్రపంచ సిఓపిడి డే మరియు దాని థీమ్ ఏమిటి?
ప్రతి సంవత్సరం నవంబర్ 3వ బుధవారం ప్రపంచ సిఓపిడి దినోత్సవంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారన్నారు. ఈ సంవ‌త్స‌రం ప్రపంచ సిఓపిడి దినోత్సవం యొక్క 2024 థీమ్ ఁమీ ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఁ ప్రపంచ సిఓపిడి దినోత్సవం నవంబర్ 20న జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఊపిరితిత్తుల పనితీరును కొలిచే ప్రాముఖ్యతను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, దీనిని స్పిరోమెట్రీ అని కూడా పిలుస్తారన్నారు. స్పిరోమెట్రీ అనేది నిర్ధారణకు ఒక సమగ్ర సాధనం అయినప్పటికీ సిఓపిడి, ఇది జీవితాంతం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కొలవడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత..

0

కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి.రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.4 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మంగల్‌పల్లిలో 11.4 డిగ్రీలు, దక్షిణ హైదరాబాద్‌లో 13 నుంచి 15 డిగ్రీలు, కోర్‌ సిటీలో 17 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఎనిమిది రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.