Wednesday, May 14, 2025
Home Blog Page 14

లాహోర్‌ను వీడండి: అమెరికా

ఇస్లామాబాద్‌: లాహోర్‌లో పాక్‌ మోహరించిన హెచ్‌క్యూ 9 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ రాడార్లను భారత్‌ ధ్వంసం చేయడంతో అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే తక్షణమే లాహోర్‌ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నగరంలో పేలుళ్లు, డ్రోన్ల కూల్చివేతలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పేర్కొంది. తమ సిబ్బందిని షెల్టర్‌లోకి తరలించినట్లు వెల్లడిరచింది. బుధవారం రాత్రి పాకిస్థాన్‌ భారత్‌లోని 15 నగరాలు లక్ష్యంగా దాడులు మొదలుపెట్టడంతో భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని సకాలంలో అడ్డుకొన్నాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. నేటి ఉదయం నుంచి పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకొంటుండంతో తీవ్ర గందరగోళం నెలకొంది. యుద్ధ భయంతో పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి 7 శాతం పతనమైంది. దీంతో ట్రేడిరగ్‌ను కొద్దిసేపు ఆపేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 రంగంలోకి దిగింది. నిన్నరాత్రి పాక్‌ ప్రయోగించిన చాలా ఆయుధాలను ఇది నిర్వీర్యం చేసింది. తాజాగా రావల్పిండిలోని క్రికెట్‌ మైదానంలో కూడా పేలుడు జరిగినట్లు సమాచారం. ఇక్కడ రాత్రికి జరగాల్సిన పాకిస్థాన్‌ లీగ్‌ మ్యాచ్‌ వాయిదా పడిరది. గురువారం మధ్యాహ్నం కరాచీ, గుజ్రాన్‌వాలా, చక్వాల్‌, అట్టోక్‌, కరాచీ, చోర్‌, బహవల్పూర్‌, మినవాలి…తదితర ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ, వీటిపై భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పాకిస్థాన్‌ వెన్నులో వణుకుపుట్టించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ విరుచుకుపడిరది. దీని తర్వాత పాకిస్థాన్‌ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది. దీనిని ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అడ్డుకుని పాక్‌ దాడిని భగ్నం చేసింది. మరోవైపు, కౌంటర్‌ అటాక్‌గా భారత్‌… లాహోర్‌లోని పాకిస్థాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ని సర్వనాశనం చేసింది. గురువారం ఉదయం లాహోర్‌ కంటోన్మెంట్‌కి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయిల్‌ తయారీ హార్పి డ్రోన్స్‌ పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. పాక్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియక లాహోర్‌, కరాచీ, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలు మూసేసింది. మరోవైపు, రాజధాని ఇస్లామాబాద్‌ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే, లాహోర్‌ను వెంటనే విడిచి వెళ్లాలని అమెరికా తన ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్‌ దాడులు ఇందుకు కారణమని తెలుస్తోంది. లాహోర్‌ ప్రధాన విమానాశ్రయం సమీపంలోని ప్రజల్ని పాక్‌ అధికారులు ఖాళీ చేయిస్తున్నారనే సమాచారం పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అందింది. లాహోర్‌లో ఉన్న అమెరికన్లు వెంటనే నగరాన్ని విడిచివెళ్లాలని, సాధ్యం కాకపోతే షెల్టర్‌లో ఉండాలని ఆదేశించింది.

9 ప్రాంతాల్లో భారత్‌ డ్రోన్‌ దాడులు

0

పాక్‌ ఆర్మీ ఆరోపణ
ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. గురువారం ఉదయం పాకిస్థాన్‌లోని లాహోర్‌తో పాటు ఇతర నగరాల్లో పేలుడు శబ్ధాలు వినిపించడంతో ఒక్కసారికి పాక్‌ ప్రజల్లో వణుకు పట్టింది. భారత్‌ మళ్లీ దాడి చేస్తుందా అనే అనుమానాలు పాక్‌ ప్రజలు వ్యక్తపరిచారు. అయితే, తాజాగా పాక్‌ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పేలుళ్లకు భారత్‌ కారణమని ఆరోపించింది. తాము భారత్‌కు చెందిన 12 డ్రోన్లను కూల్చామని పాక్‌ ఆర్మీ చెబుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్‌, రావల్పిండి, గుజ్రాన్‌వాలా, అటాక్‌, బహవల్పూర్‌ వంటి నగరాలపై డ్రోన్‌ దాడులు జరిగాయని ఐఎస్‌పీఆర్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి ఆరోపించారు. డ్రోన్‌ దాడుల తర్వాత పాకిస్థాన్‌ విమానాశ్రయాల అథారిటీ కరాచీ, లాహోర్‌, ఇస్లామాబాద్‌, ఫైసలాబాద్‌, సియాల్‌కోట్‌ ప్రధాన విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసినట్లు పాక్‌ మీడియా వెల్లడిరచింది. విమానయాన అధికారులు ‘నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌’ ద్వారా అన్ని విమానయాన సంస్థలకు దీని గురించి తెలియజేశారు. పాక్‌ మీడియా ప్రకారం లాహోర్‌కు వచ్చే అన్ని విమానాలను కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు, ఇందులో జెడ్డా, దుబాయ్‌, మస్కట్‌, షార్జా, మదీనా నుండి వచ్చే విమానాలు కూడా ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలను ఖాళీ చేయించారు.
కరాచీ జిన్నా విమానాశ్రయం కూడా మూసివేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, గురువారం ఉదయం, లాహోర్‌లోని వాల్టన్‌ రోడ్‌, పరిసర ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటి మూడు పెద్ద పేలుళ్లు వినిపించాయి, దీనితో భయాందోళనలు చెలరేగాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు. మూడు పేలుళ్లు కొన్ని సెకన్లలోనే జరిగాయని, వాటి శబ్దాలు అనేక కిలోమీటర్ల దూరం వినిపించాయని లాహోర్‌ పోలీసులు తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తాం..

కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మెరుగైన సేవలు అందిస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో హోం లో వారు విలేకరులతో మాట్లాడుతూ తాను టిడిపి హయాంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేయలేకపోయారని, నా ఇష్టంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, ఇందుకు సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి కుమార్తె ఉమా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ సాయి వరకు అభివృద్ధి పరిచేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తదుపరి పహల్గామీలో మృతి చెందిన వారికి వారు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేంతవరకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి మోడీని కోరారు. అనంతరం ఆర్డిటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే చర్యలు చేపట్టి ఆర్డిటి సంస్థను కాపాడాలని వారు కోరారు. ఆర్ డి టి దేశంలోనే ప్రముఖ సేవలు అందించుటలో మంచి గుర్తింపు పొందిందని, వేలాదిమంది పేద ప్రజలకు వివిధ సేవలను అందిస్తోందని వారు గుర్తు చేశారు. అలాంటి ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా తిరిగి సేవలు అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు. అట్లు కానీ ఎడల కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమాలు, చర్చలు జరుపుతామని తెలిపారు. ఆర్డిటి ప్రజలకు ఆక్సిజన్ లాంటిదని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు మద్దతు ద్వారా పార్టీకి న్యాయం చేసేలా పోరాటాలు సలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, పతి, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సహాయం

అందించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సహాయం రూపంలో గల చెక్కును పరిటాల శ్రీరామ్ ఆ చెక్కును కుటుంబానికి అందజేశారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని రేగాటిపల్లి పంచాయతీలోని సీతారాం పల్లి గ్రామానికి చెందిన మారుతి జనవరి 11న రోడ్డులో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ మృతి చెందిన మారుతి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సేవలు అందించారని తెలిపారు. ఈ ఐదు లక్షల నగదు సభ్యత నమోదు ద్వారా ఇన్సూరెన్స్ రూపంలో వచ్చిందని తెలిపారు. తదుపరి మృతి చెందిన కుటుంబాన్ని కూడా వారు పలకరించారు. మీ కుటుంబానికి టిడిపి అన్నివేళలా అండదండలుగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అంటే కుటుంబానికి ఒక భరోసా అని తెలిపారు. కేవలం ఒక వంద రూపాయలు కడితే రెండు లక్షల రూపాయల సహాయం అందుతుందని, ఇప్పుడు దానిని ఐదు లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ ఆలోచన నారా లోకేష్ కు రావడం వల్ల అన్ని పార్టీలకు తెలుగుదేశం పార్టీని ఒక ఆదర్శంగా మార్చిన ఘనత నారా లోకేసుకే దక్కిందని వారు తెలిపారు.

వేసవి శిక్షణ శిబిరాలకు ముఖ్య కార్యదర్శి రమ ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 9వ రోజుఉచిత వేసవి శిక్షణ శిబిరాలు గ్రంధాలయ ముఖ్య కార్యదర్శి రమా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణా శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుకు బాట వేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తమకు ఉన్న అనుకూల సమయంలో గ్రంథాలయములో వివిధ రకాల పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం వెన్నెల టీచర్ చే తెలుగు కథలు చెప్పడం ఇంగ్లీష్ గ్రామర్ పిల్లలకు బోధించడం జరిగిందన్నారు. ధ్యాన యోగం కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

ఘనంగా జరిగిన వీరబ్రహ్మం స్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు..

భక్తాదులు, పురోహితులు లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎర్రగుంటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పురములో గల వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన మహోత్సవాలు పురోహితులు లక్ష్మీనారాయణ, భక్తాదులు, ఎల్ సి కె పురం ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితుల లక్ష్మీనారాయణ గణపతి పూజ, నవగ్రహాలు, శివునికి, అభిషేకం, వీర బ్రహ్మం విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలకు వివిధ పూలలతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను భక్తాదులు, ప్రజలు సహాయ సహకారాలతో, దాతల సహృదయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి వీరబ్రహ్మం చరిత్ర, వారి మహిమలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట,ఎల్సికుపురం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్మవరం రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహణ..ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరంలోని రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మాక్ డ్రిల్ లో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ నటరాజ్, రైల్వే స్టేషన్ మాస్టర్ నరసానాయుడు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, రెవెన్యూ, జి ఆర్ పి, ఆర్పిఎఫ్ నిర్వహించారు. వీరందరూ కూడా అవగాహన కొరకు మాకు డ్రిల్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఒకవేళ పాకిస్తాన్ మన దేశంపై ప్రతి దాడి చేస్తే ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రమాదాలు జరిగితే ఎలా రక్షించుకోవాలి, ప్రమాదాల బారిన పడితే వైద్యులు చేసే ప్రధమ చికిత్సలు తదితర వాటిని ఈ డ్రిల్స్లో వివరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూరాలు పార్టీ శాని పై మనవాళ్లు యుద్ధం చేసి కొందరు ఉగ్రవాదులు కూడా హతమార్చడం జరిగిందని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతోందని, ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి రాజు జి ఆర్ పి సి ఐ అశోక్ కుమార్, వీఆర్ఏ రవి శేఖర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. కేబినెట్‌ ఆమోదముద్ర

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధాని స్థానంలో అమరావతి పేరును అధికారికంగా చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఇటీవల జరిగిన 47వ సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది. ఇటీవల భారత త్రివిధ దళాలు విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. దేశ భద్రత కోసం సైనికులు చేసిన సాహసోపేతమైన చర్యలను కొనియాడింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతిపై కేబినెట్‌లో చర్చించారు. రాష్ట్రంలోని తీరప్రాంత భద్రతను మరింత పటిష్టం చేయడం, రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహించారు. మరోవైపు మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వేట నిషేధ సమయంలో వారికి అందించే ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో మెగా ఈవెంట్స్‌ను నిర్వహించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ పరిధిలో 281 అభివృద్ధి పనులను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఉపయోగపడనుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను ఉపసంహరించుకునే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం అంగీకరించింది. అయితే ఆ బిల్లులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

దండ‌కార‌ణ్యంలో మావోల‌కు ఎదురుదెబ్బ .. ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

భ‌ద్ర‌తా ద‌ళాల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య గురువారం ఉద‌యం జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు చంద్ర‌న్న‌, స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ స‌భ్యుడు బండి ప్ర‌కాశ్ ఉన్నారు. బుధ‌వారం జ‌రిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో 24 మంది మృతి చెందారు. క‌ర్రెగుట్ట‌ల్లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 22 మంది, అల్లూరు సీతారామారాజు జిల్లా వైరామ‌వ‌రం మండ‌లంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు మృతి చెందారు. క‌ర్రెగుట్ట‌ల్లో త‌ల‌దాచుకున్న మావోయిస్టుల‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు విరుచుకుప‌డుతున్నాయి. క‌ర్రెగుట్ట‌ల్లో ఆప‌రేష‌న్ ప్రారంభ‌మై 17వ రోజుకు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు ఎన్‌కౌంట‌ర్ల‌లో 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర‌ల‌కు ముగ్గురు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. అలాగే ముగ్గురు పోలీసులు మృతి చెంద‌గా, మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు.

ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సల్స్ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు అగ్రనేతలు జగన్ అలియాస్ పండ‌న్న‌, రమేష్ అలియాస్ నాగన్న ఉన్నారు. జీకేవీధి ఏజెన్నీలో కూంబింగ్ కొనసాగుతోంది.

రూ.25 లక్షల రివార్డు..
ఈ మేరకు జీకే వీధి ఏజెన్సీలో మావోయిస్టులున్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. దీంతో ఇద్దరి మధ్య కాల్పులు చోటుచేసుకోగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్‌ అలియాస్‌ పండన్న చనిపోయారు. జగన్‌పై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. ఇక మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్‌ మృతి సైతం మృతిచెందగా అతనిపై రూ. 5 లక్ష రివార్డ్ ఉంది. ఇక‌ నాగన్న మల గెట్ట గ్రామం, కలిమెలా బ్లాక్, మల్కన్ గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రం డిసిఎం గా విధులు నిర్వహిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొమ్ములవాడ గ్రామానికి చెందిన.. కాకూరి పండన్న ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పంజాబ్ సరిహద్దులో భారీ శబ్దాలు, క్షిపణి శకలాల కలకలం!

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో క్షిపణి శకలాలు కనిపించడం కలకలం రేపింది. జేతువాల్, మఖాన్ విండి, పంధేర్ గ్రామాల పరిధిలోని పొలాల్లో ఈ క్షిపణి అవశేషాలను గుర్తించారు. ఃఆపరేషన్ సిందూర్ః కొనసాగుతున్న సమయంలో, తమ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని, వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

జేతువాల్ గ్రామానికి చెందిన ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ, ఁభారీ పేలుడు శబ్దం వినిపించిన తర్వాత చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. మా గ్రామంలోని పొలాల్లో క్షిపణికి చెందిన ముక్కలు పడ్డాయి అని తెలిపారు.

సమీపంలోని మఖాన్ విండి గ్రామస్థులు కూడా తమ పొలాల్లో రాకెట్ వంటి వస్తువుల శకలాలు పడి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించారు. ఈ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే సైనిక దళాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి.

మఖాన్ విండి సమీపంలోని ఒక పొలంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న లోహపు శకలం లభించింది. పంజాబ్ పోలీసులు ఈ శకలాలను గుర్తించిన విషయాన్ని ధృవీకరించారు. ఈ శకలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి దేనికి చెందినవి అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.