Tuesday, May 13, 2025
Home Blog Page 299

ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి పూజ వేడుకలు..

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని ఎస్ఎల్వీ మార్కెట్ పాత బస్టాండ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగులకట్ట ఆలయంలో భక్తాదుల , అర్చకులు విజయ్ కుమార్ శర్మ నడుమ సుబ్రహ్మణ్య షష్టి పూజ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారదోలుదాం…. జిల్లా ఎస్పీ రత్న

విశాలాంధ్ర ధర్మవరం;; సమిష్టి కృషితో డ్రగ్సును పారదోలుదామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ పేరెంట్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తదుపరివారు డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు , సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు.మత్తుకు దూరంగా ఉండండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలపాలని,అందరూ సమిష్టి కృషితో డ్రగ్ అనే మత్తు పదార్థాన్ని పారదోలుదామని తెలిపారు. తొలుత జిల్లా ఎస్పీ కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ , ,ఆన్లైన్ మోసాలు , సైబర్ నేరాలపై ఏర్పాటుచేసిన పోస్టర్ల వాటిపై ఎస్పీ ఉపాధ్యాయులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మీటింగ్ లో పాల్గొని పోలీసు పరంగా డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.ముఖ్యంగా యువత ఎక్కువుగా గంజాయికు అలవాటుపడి బంగారు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటున్నారని , యువతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి జిల్లాలోను ఈ టాస్క్ ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. గంజాయి విస్తరించడంలో కీలకపాత్ర పోషించే ఫెడ్లర్స్, ట్రాన్సుపోర్టర్స్, కంజూమర్స్ పై దృష్టిపెట్టి వాటిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు తెలిపిన వారిని గోప్యంగా ఉంచుతామన్నారు.
ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో చెలగాటమాడే గంజాయిను సమిష్టిగా నిరోధించాలన్నారు. ముఖ్యంగా యువత మేల్కొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వాడే విద్యార్థులలో ఉన్నట్లుండి లక్షణాలులో మార్పులు మనం గమనించవచ్చన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడడం వల్ల విచక్షణ కోల్పోయి పిల్లలపై అగత్యాలకు పాల్పడుతున్నారు.
తమ పిల్లలకు రోజు బడికి వెళ్తున్నారా లేదా ఎవరితో వెళ్తున్నారు ఎప్పుడొస్తున్నారని ఎప్పటికప్పుడు వారిపై తప్పక దృష్టి పెట్టాలని సూచించారు. ఏ మార్పు అయినా సరే ప్రభుత్వ బడుల నుంచే మొదలవ్వాలని తెలిపారు.
తాను కూడా పదో తరగతి వరకు ప్రభుత్వ బడులను చదువుకున్నా నని తెలిపారు.
దీంతో పాటు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెల్ ఫోన్లు వాడకం కూడా జోరందుకుందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉందని దుర్వినియోగానికి ఉపయోగించరాదన్నారు. మంచికి మాత్రమే వినియోగించాలి అని,ఇంటర్నెట్ , ట్యాబ్ లు వినియోగం దుర్వినియోగం కాకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఏవిపడితే అవి పోస్టులు పెట్టడం, ఫోర్నోగ్రఫీ చూడటం లాంటివి చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లు తెలియజేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లలు ఎటువంటి వ్యామోహాలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆడపిల్లల యొక్క బలం చదివేనని , బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలో నిజం చేయాలన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని, అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరస్తుల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల గురించి క్షుణ్ణంగా వివరించారు. డబ్బు ఎవరు ఫ్రీగా ఎవరూ ఇవ్వరు అని తెలుసుకోవాలన్నారు. డిజిటల్ రంగంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నామని… ఉద్యోగాల పేరున మోసాలు, ఆన్లైన్ లో అరెస్టు చేస్తామని నకిలీల బెదిరింపులు… ఇలా సైబర్ మోసాలపై అవగాహన చేశారు. ఫోక్సో చట్టం గురించి తెలియజేశారు.అనంతరం పిల్లల బంగారు భవిష్యత్తుకు… శారీరక, మానసిక, నైతిక వికాసానికి పాటుపడదామని ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తమ జీవిత లక్ష్యం ఐపీఎస్ కావాలని కొందరు విద్యార్థులు ఎస్పీ మేడం తో మంచి క్రమశిక్షణతో చదువుకొని, ముందుకెళితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు విద్యార్థులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు , ఎంఈఓ గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి, ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ , ఎస్బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి,పట్టణ టూ టౌన్ సిఐ రెడ్డప్ప , ఎస్బిఎస్ఐ ప్రదీప్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు, పాఠశాల కమిటీ తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే విద్యార్థి భవిష్యత్తుకు భరోసా

విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : మండలంలోని చుక్కలూరు హై స్కూల్, పట్టణంలోని సుధా శ్రీరాములు హై స్కూల్, ఏపీ మోడల్ హై స్కూల్లలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా తల్లిదండ్రుల – ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు బోధించే చదువును శ్రద్ధతో చదివి, ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అలాగే ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటూ, క్రమశిక్షణతో మెలగాలన్నారు. అంతేకాకుండా విద్యతోనే ప్రతి విద్యార్థికి భవిష్యత్తుకు భరోసా అన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నాగరాజు, రామ గోవిందరెడ్డి పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్, విద్యార్థులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

గురుకులంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్

0

విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం రూరల్ : తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసారని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ అన్నారు పెడతాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులకు కబడ్డీ,ముగ్గుల పోటీలు,సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించారు అనంతరం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ప్రిన్సిపల్ బి.రాజారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహసీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంచుకున్న రంగంలో విజయం సాధించేవరకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలన్నారు, ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు మండల విద్యాశాఖ అధికారి హనుమ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యా ప్రణాళికతో పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు రూరల్ ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి, విద్యార్థులను తల్లిదండ్రులు ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 జ్యోతి, ఎస్ఎంసి చైర్మన్ ప్రకాష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రతాప్ ఉపాధ్యాయులు,విద్యార్థులు తల్లిదండ్రులుసిబ్బంది పాల్గొన్నారు

హత్యాయత్నం కేసులో ఆరుగురు అరెస్టు

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : గన్నెవారి పల్లి కాలనీలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లెల వేణుగోపాల్ ప్రత్యర్థి బిజిలి రామాంజనేయులు వర్గీయుల మధ్య ఈనెల మూడవ తేదీన వరాల తోట పంప్ హౌస్ వద్ద జరిగిన గొడవలలో దండు శ్రీనివాసులు, హాజీ భాష, అజయ్ లపై వేణ తన వర్గీయులతో దాడి చేశారు. ఈ దాడిలో దండు శ్రీనివాసులు, హాజీ భాష గాయపడ్డారు. పరారీలో ఉన్న నిందితులు శివాలయం వద్ద ఉన్నారని సమాచారం మేరకు ఎస్డిపిఓ రామకృష్ణుడు ఆదేశాల మేరకు రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి అయిన నేను ఎస్సైలు ధరణి బాబు, కాటుమయ్య పోలీసు సిబ్బందితో కలిసి తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మల్లెల నారాయణస్వామి కుమారుడు మల్లెల వేణుగోపాల్ అలియాస్ పొట్టి వేణు, వయస్సు 35 సంవత్సరాలు, శివాలయం వీధికి చెందిన చాకలి గోవిందు కుమారుడు చాకలి సురేష్ అలియాస్ గౌతమ్ వయస్సు 35 సంవత్సరాలు, షేక్ మహబూబ్ బాషా కుమారుడు షేక్ హుస్సేన్ వలి అలియా బడే, వయస్సు 27 సంవత్సరాలు, పోరాట కాలనీకి చెందిన చింతా రామకృష్ణ కుమారుడు చింత గోపీ కృష్ణనాథ అలియాస్ గోపి వయస్సు 26 సంవత్సరాలు, మెయిన్ బజార్ కు చెందిన షేక్ బాబు కుమారుడు షేక్ మహమ్మద్ హుస్సేన్ వయస్సు 33 సంవత్సరాలు, హరిజనవాడకు చెందిన బండారు వెంకట రంగయ్య కుమారుడు బండారు రామాంజినేయులు అలియాస్ అంజి, వయస్సు 23 సంవత్సరాలు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కట్టెలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరు పరచామని చెప్పారు.

జీవానంద పాఠశాలకు ఈటీ టెక్ ఎక్స్ ట్రయల్ బి లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కైవసం..

డైరెక్టర్లు సంజీవరెడ్డి, శ్రీకాంత్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని జీవానంద ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలకు ఈటి టెక్ ఎక్స్ ట్రైల్ బి లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ 2024-25 అవార్డు కైవసం చేసుకోవడం జరిగిందని పాఠశాల డైరెక్టర్లు సంజీవరెడ్డి, శ్రీకాంత్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాల గర్వించదగిన విజయాన్ని సాధించడం మాకెంతో గర్వంగా సంతోషంగా ఉందని తెలిపారు.ఈ అవార్డు హైదరాబాదులోని హైటెక్ ఎక్స్ లో డిసెంబర్ 6న డైరెక్టర్స్ సంజీవరెడ్డి కొలసాని శ్రీకాంత్ అందుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో వేల పాఠశాలల్లో టాప్ 25 స్టేట్ బోర్డ్ పాఠశాలలో మా సంస్థను గుర్తించి అవార్డు ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపారు. పాఠశాల అన్ని విభాగాల్లో ఈ ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఎడ్యుకేషన్ డిసిప్లిన్ మాత్రమే అని, పాఠశాలలో ఎన్నో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్‌ చేస్తోందని అందుకు గాను ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్‌ ఎక్సలెన్స్ అందుకోవడం జరిగిందని తెలిపారు.అలాగే బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కూల్ గా గుర్తింపు పొందడం పాఠశాల ఉపాధ్యాయుల అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. ఇన్స్పిరేషనల్ లీడర్‌షిప్‌లో ఎక్సలెన్స్ మరియు లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్‌ ఎక్సలెన్స్ విభాగాల్లో కూడా పాఠశాలకు అవార్డు పొందినందుకు ఆనందంగా ఉందని గర్వంగా కూడా ఉందని తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. పాఠశాల ఇంత క్రమశిక్షణ గా ఉండడానికి ప్రిన్సిపాల్ దాదా ఖలందర్ కు డైరెక్టర్స్ రాధాకృష్ణ , నాగేశ్వర్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పిల్లల తల్లి తండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

పండుగ వాతావరణం లో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేరెంట్స్, టీచర్స్, సమావేశ పండుగ సందర్భంగా మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణం ఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో ఏర్పాటుచేసిన వివిధ పోటీలలో తల్లితండ్రులు పాల్గొన్నారు. పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అంద చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి జే. సురేష్ బాబు, ఎస్సై చంద్రశేఖర్ సందర్శించారు. ఎస్ఎంసి చైర్మన్ పి .పద్మ, వార్డ్ నెంబర్ రవికుమార్, బొబ్బర మంగరాజు, ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, సుశీల, రాజ్యలక్ష్మి, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.

విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలపై ఆసక్తి చూపాలి…

విశాలాంధ్ర- ఆగిరిపల్లి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని ఈదర ప్రధాన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్కే వేణుగోపాలరావు పేర్కొన్నారు. ఈదర మండల పరిషత్ ప్రాథమిక ప్రధాన పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గం.9లకు తల్లిదండ్రులను ఆహ్వానించడం తో కార్యక్రమం ప్రారంభమైంది. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిని వివరించారు. తండ్రులకు టగ్ ఆఫ్ వార్,తల్లులకు రంగోలి పోటీలను నిర్వహించడం జరిగింది.పూర్వ విద్యార్థి గరిసేపల్లి రాంబాబు తన విజయగాధను తెలిపారు.సచివాలయం మహిళా పోలీస్ బండారు భవాని సైబర్ నేరాలు జరుగుతున్న విధానం,తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎస్ సుబ్బారెడ్డి మిడ్ డే మీల్స్ నాణ్యత గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు మధ్య వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్య పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని పర్యవేక్షించాలని సూచించారు. విద్యా విధానంపై తల్లిదండ్రులు సలహాలు సూచనలు అందజేయాలని కోరారు.అనంతరం వచ్చిన అతిథులకు భోజనాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఎం నిర్మల దేవి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వడపర్తి రమేష్,వైస్ చైర్మన్ గుర్రం నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ దిడ్డి సునీత, ఏఎన్ఎం లక్ష్మి,లలిత, అనసూర్య,పూజిత,రంగమ్మ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం.. ఎమ్మార్వో సురేష్ బాబు

విశాలాంధ్ర-ధర్మవరం : ప్రజా సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యము అని తహసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులు మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజలు, రైతుల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం ప్రభుత్వ భూములు గాని స్థలము గాని ఎవరైనా ఆక్రమించినచో కఠిన చర్యలతో పాటు తప్పక కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చట్టపరంగా జీవించే విధానాన్ని గ్రామ ప్రజలు అలవాటు చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులో ఎటువంటి సమస్యలైనా కూడా నిర్ణీత గడువు తేదీలోగా పరిష్కరించబడుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. ప్రజల ద్వారా వచ్చిన అర్జీలపై త్వరితగతిన విచారణ చేపట్టి, ఉన్నతాధికారుల ఆదేశాను ప్రకారం పరిష్కరించబడుతుందని తెలిపారు. మొత్తం 12 దరఖాస్తులు రావడం జరిగిందని త్వరలో పరిష్కరించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వే, ఎండోమెంట్ అధికారులు, వీఆర్వోలు, సర్వేయర్లు,, ఫారెస్ట్ విభాగపు అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప స్వామి విగ్రహ పోతా వేడుకలు.. గురు స్వామి విజయకుమార్

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ పూత వేడుకలు గురుస్వామి విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శిష్య బృందం నిర్వహించుకున్నారు. అనంతరం గురుస్వామి మాట్లాడుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలాదిమంది అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఇటీవలే గురు స్వామి ఆధ్వర్యంలో పంచలోహ విగ్రహ తయారీకి భిక్షాటన చేసి, ధర్మవరం పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు భక్తాదుల నుండి విరివిరిగా విరాళాలు స్వీకరించారు. మొత్తం 200 కిలోల వరకు పంచలోహం వాడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం జడ్జి దెబ్బతులు స్వామివారి పూజలో కూడా పాల్గొని తమవంతుగా సహాయ సహకారాలను అందించారు. భక్తజన సందోహం నడుమ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామితో పాటు బండపల్లి ప్రకాష్ కలవల శివకుమార్ కలవల రాంకుమార్, వేలాదిమంది అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తులు పాల్గొన్నారు.