Sunday, January 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసమిష్టి కృషితో డ్రగ్స్ ను పారదోలుదాం…. జిల్లా ఎస్పీ రత్న

సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారదోలుదాం…. జిల్లా ఎస్పీ రత్న

విశాలాంధ్ర ధర్మవరం;; సమిష్టి కృషితో డ్రగ్సును పారదోలుదామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ పేరెంట్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తదుపరివారు డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు , సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు.మత్తుకు దూరంగా ఉండండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలపాలని,అందరూ సమిష్టి కృషితో డ్రగ్ అనే మత్తు పదార్థాన్ని పారదోలుదామని తెలిపారు. తొలుత జిల్లా ఎస్పీ కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ , ,ఆన్లైన్ మోసాలు , సైబర్ నేరాలపై ఏర్పాటుచేసిన పోస్టర్ల వాటిపై ఎస్పీ ఉపాధ్యాయులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మీటింగ్ లో పాల్గొని పోలీసు పరంగా డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.ముఖ్యంగా యువత ఎక్కువుగా గంజాయికు అలవాటుపడి బంగారు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటున్నారని , యువతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి జిల్లాలోను ఈ టాస్క్ ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. గంజాయి విస్తరించడంలో కీలకపాత్ర పోషించే ఫెడ్లర్స్, ట్రాన్సుపోర్టర్స్, కంజూమర్స్ పై దృష్టిపెట్టి వాటిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు తెలిపిన వారిని గోప్యంగా ఉంచుతామన్నారు.
ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో చెలగాటమాడే గంజాయిను సమిష్టిగా నిరోధించాలన్నారు. ముఖ్యంగా యువత మేల్కొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వాడే విద్యార్థులలో ఉన్నట్లుండి లక్షణాలులో మార్పులు మనం గమనించవచ్చన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడడం వల్ల విచక్షణ కోల్పోయి పిల్లలపై అగత్యాలకు పాల్పడుతున్నారు.
తమ పిల్లలకు రోజు బడికి వెళ్తున్నారా లేదా ఎవరితో వెళ్తున్నారు ఎప్పుడొస్తున్నారని ఎప్పటికప్పుడు వారిపై తప్పక దృష్టి పెట్టాలని సూచించారు. ఏ మార్పు అయినా సరే ప్రభుత్వ బడుల నుంచే మొదలవ్వాలని తెలిపారు.
తాను కూడా పదో తరగతి వరకు ప్రభుత్వ బడులను చదువుకున్నా నని తెలిపారు.
దీంతో పాటు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెల్ ఫోన్లు వాడకం కూడా జోరందుకుందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉందని దుర్వినియోగానికి ఉపయోగించరాదన్నారు. మంచికి మాత్రమే వినియోగించాలి అని,ఇంటర్నెట్ , ట్యాబ్ లు వినియోగం దుర్వినియోగం కాకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఏవిపడితే అవి పోస్టులు పెట్టడం, ఫోర్నోగ్రఫీ చూడటం లాంటివి చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లు తెలియజేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లలు ఎటువంటి వ్యామోహాలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆడపిల్లల యొక్క బలం చదివేనని , బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలో నిజం చేయాలన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని, అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరస్తుల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల గురించి క్షుణ్ణంగా వివరించారు. డబ్బు ఎవరు ఫ్రీగా ఎవరూ ఇవ్వరు అని తెలుసుకోవాలన్నారు. డిజిటల్ రంగంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నామని… ఉద్యోగాల పేరున మోసాలు, ఆన్లైన్ లో అరెస్టు చేస్తామని నకిలీల బెదిరింపులు… ఇలా సైబర్ మోసాలపై అవగాహన చేశారు. ఫోక్సో చట్టం గురించి తెలియజేశారు.అనంతరం పిల్లల బంగారు భవిష్యత్తుకు… శారీరక, మానసిక, నైతిక వికాసానికి పాటుపడదామని ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తమ జీవిత లక్ష్యం ఐపీఎస్ కావాలని కొందరు విద్యార్థులు ఎస్పీ మేడం తో మంచి క్రమశిక్షణతో చదువుకొని, ముందుకెళితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు విద్యార్థులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు , ఎంఈఓ గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి, ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ , ఎస్బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి,పట్టణ టూ టౌన్ సిఐ రెడ్డప్ప , ఎస్బిఎస్ఐ ప్రదీప్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు, పాఠశాల కమిటీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు