Tuesday, May 13, 2025
Home Blog Page 358

విద్యుత్‌ చార్జీలపై 19న భారీ నిరసన

పవన్‌ భుజంపై ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా: రామకృష్ణ విమర్శ
20 నుంచి సభలు, సమావేశాలు: శ్రీనివాసరావు

విశాలాంధ్ర – విజయవాడ : సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపటం దుర్మార్గమని, పెంచిన చార్జీలు రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వామపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అజెండాను భుజానవేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చార్జీల భారం రూ.6,072 కోట్లు మోపగా… తాజాగా మరో రూ.11 వేల కోట్ల భారం మోపాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏనాడూ ఇంత పెద్ద ఎత్తున భారం పడలేదన్నారు. పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. చార్జీల పెంపుపై అభ్యంతరాలు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ఈ నెల 19వ తేదీ వరకు అవకాశం కల్పించిందని, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను ఏపీఈఆర్‌సీకి స్పష్టంగా చెప్పాలని కోరారు. ఈ అభ్యంతరాలపై తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని ఏపీఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాపం తమకు శాపంగా మారిందని, కృష్ణపట్నం, వీటీపీఎస్‌లలో విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా బయట నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయటం వల్ల చార్జీల భారం మోపకతప్పటం లేదని చెప్పటం, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ చార్జీలు పెంచటాన్ని సమర్థిస్తూ కథనాలు రాయటం సరికాదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈనెల 19వ తేదీన విజయవాడలో వామపక్షాలు నిరసన తెలియజేయనున్నట్లు వెల్లడిరచారు. 20 నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పనితీరును ఎండగడతామని హెచ్చరించారు. సనాతనవాదంపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అయిన సనాతనవాదాన్ని పవన్‌ భుజానకెత్తుకుని మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. పవన్‌ సినిమాలను అందరూ చూడబట్టే ఆయన గొప్పగా ఎదిగారని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు జనసేనలో ఉన్నారని, జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని సందర్భంలో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయమని అమిత్‌ షా కోరినప్పుడు పవన్‌ అంగీకరించకపోవటంతో జనసేన పార్టీని లౌకికపార్టీగా ప్రజలు గుర్తించారని చెప్పారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ తరపున ఉన్న సత్యకుమార్‌, ఇతర మంత్రులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం లేదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పవన్‌ కల్యాణ్‌ని హద్దుల్లో పెట్టాలని కోరారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. విద్యుత్‌ చార్జీల భారం జగన్‌ ప్రభుత్వ నిర్ణయమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. విద్యుత్‌ భారాలు వేసిన వైసీపీని ప్రజలు తిరస్కరించారన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుతో వినియోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూ.1.80 నుండి రూ.2.40 అదనపు భారం పడుతుందన్నారు. గతంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వద్దన్న టీడీపీ…ఇప్పుడు కొనసాగిస్తున్నదని ఆరోపించారు. విద్యుత్‌ మీటర్ల కాంట్రాక్టును టీడీపీ సర్కారు కూడా షిర్డీసాయి కంపెనీకే కట్టబెడుతున్నదని తెలిపారు. మద్యం, ఇసుక, పెరిగిన ధరలపై ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే అసంతృప్తి ఉందన్నారు. ప్రజావాణి వినిపించేందుకు 19న నిరసన తెలుపుతున్నట్లు స్పష్టంచేశారు. ఈ నెల 20 నుండి వామపక్ష నాయకులు మూడు దళాలుగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు. వామపక్షాలు చేపట్టిన ఆందోళనకు ప్రజలు మద్దతు పలికి జయప్రదం చేయాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించాలన్నారు. జనసేన కార్యకర్తలు ఆలోచించి మత రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కే ఖాదర్‌బాషా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు రద్దు చేయకపోతే బషీర్‌బాగ్‌ తరహా విద్యుత్‌ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని వపన్‌కల్యాణ్‌కి హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.పొలారి పాల్గొన్నారు.

విశాలాంధ్రకు స్పందన

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వెనుక బాగాన ఉన్న ట్రాన్స్ఫార్మర్ దీన్ని బీటలు ఉండడంతో పూర్తిగా ఒరిగిపోయింది.. ఈ విషయంపై రెండు రోజుల కిందట విశాలాంధ్ర దినపత్రికలో కథాంశం ప్రచురింపబడింది. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్ఫార్మర్లకు పడిపోకుండా తిరిగి ఒక ఎత్తైన అరుగు ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా నివారించారు. దీంతో అవార్డు ప్రజలు విశాలాంధ్ర దినపత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాలుడు ఎంపిక ..

ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెట్టిపీ జయ చంద్రారెడ్డి
విశాలంద్ర ధర్మవరం : రాష్ట్ర స్థాయిలో ఈ నెల నవంబర్ 09 తేదీ నుండి 11 తేదీ వరకు శ్రీకాకుళంలో జరిగే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( ఎస్ జి ఎఫ్)రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో లో పాల్గొనే అండర్ 19 విభాగంలో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్టులో బాలుర విభాగంలో విజయ్ తరుణ్ ఎంపికయ్యారని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు .రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు..ఎంపికైన క్రీడాకారుడు గురువారం రోజున బయలుదేరి శ్రీకాకుళం కి వెళ్లారు.

యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి

యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ ఆర్. రామకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం : యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ ఆర్. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని బిఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు యుటిఎఫ్ జిల్లా మున్సిపల్ కన్వీనర్ బిల్లే రామాంజనేయులు, స్థానిక నాయకులు రాంప్రసాద్ ,హరిశంకర్ ,ప్రదీప్ కుమార్ తదితరులతో కలిసి యుటిఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభల పోస్టర్లను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ ఆదివారం రోజున 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి పట్టణములో జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎంతో ఆశతో తెచ్చుకున్న నూతన ప్రభుత్వం ఉద్యోగుల కోరికలను మన్నించి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని, బకాయి పడ్డ డి ఎ, అండ్ పి ఎఫ్, ఏపీ జి ఎల్ ఐ సి మొత్తాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల అపార్ నంబర్ జెనరేట్ లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలి.. కమిషనర్ ప్రమోద్ కుమార్

విశాలాంధ్ర-ధర్మవరం : పురపాలక సంఘ కార్యాలయమునకు ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి ఎంతో అవసరమని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులకు అవినీతి కార్యదర్శలతో మున్సిపాలిటీ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించి, వివిధ విషయాలపై వారు చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ.13.77 కోట్లు, నీటి పన్ను 8.88 కోట్ల రూపాయలు, ఖాళీ స్థలాల పన్ను 90 లక్షల రూపాయలు ఇంకను బకాయి కలదని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ బకాయిలను వసూలు చేయాలని వారు ఆదేశించడం జరిగిందని తెలిపారు. పన్నుల వసూలను వేగవంతం చేయాలని, ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్ళినప్పుడు విజయం చేకూరుతుందని తెలిపారు. అన్ని వార్డుల కార్యదర్శులు పన్నులపై ప్రత్యేక దృష్టి సారించి తమ సహాయ సహకారాలను మున్సిపాలిటీ అందించాలని తెలిపారు.

ల్యాబ్ టెక్నీషియన్స్ కు అసోసియేషన్ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర -ధర్మవరం:: రెండు రోజుల క్రిందట ధర్మారం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రదీప్, ఇతీష్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సమాచారంతో ధర్మవరం మెడికల్ ల్యాబ్స్ టెక్నీషియన్ అసోసియేషన్ వారు వారి ఇంటికి స్వయంగా వెళ్లి 22 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రకాష్, కరుణాకర్ ,అంజన్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక

విశాలాంధ్ర-ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన పిఈటి శివకృష్ణ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ లాంగ్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు కొత్తచెరువు మండలం కేసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 6వ తేదీ లా అండ్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న శివకృష్ణ మూడు మ్యాచుల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఈ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారులతో పాటు తోటి ఉపాధ్యాయ బృందము పిఈటి బృందము బంధుమిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక

విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన పిఈటి శివకృష్ణ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ లాంగ్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు కొత్తచెరువు మండలం కేసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 6వ తేదీ లా అండ్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న శివకృష్ణ మూడు మ్యాచుల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఈ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారులతో పాటు తోటి ఉపాధ్యాయ బృందము పిఈటి బృందము బంధుమిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి

ఉల్లాస్ పై వాలంటీర్లకు శిక్షణ

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరికీ విద్యను అందించడం మనందరి బాధ్యత అని వయోజన విద్యా ప్రాజెక్టు జిల్లా సూపర్వైజర్ నేమిలయ్య, వెలుగు ఏపిఎం జగదీష్ అన్నారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో వివోఏలు, పొదుపు సంఘాల మహిళా సభ్యులకు ఃఉల్లాస్ఃపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, వయోజనులకు విద్యపై వాలంటీర్లకు పూర్తి అవగాహన కలిగించారు. ఇందులో వారికి ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, అక్షర వెలుగు వంటివి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్ష్య రాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్‌ పథకంను రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన వయోజనులకు చదువు నేర్పించి అక్షరాస్యులుగా దిద్దాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. మండల పరిధి 33 గ్రామాల నుంచి 3500 మంది వయోజనులను గుర్తించామన్నారు. వారిలో ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ చొప్పున 350 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వెలుగు సీసీలు, వివోఏలు, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

ఏ.ఆర్ సాయుధ బలగాల పరేడ్ ను తనిఖీ

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం జిల్లా ఎస్పీ పి.జగదీష్ అనంతపురం రూరల్ సబ్ డివిజనన్ల సిబ్బంది, ఏ.ఆర్ సాయుధ బలగాల పరేడ్ ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ కల్గి ఉండాలన్నారు. చక్కగా యూనిఫాం ధరించి ప్రజలతో మంచి సంబంధాలు కల్గి ఉండాలి అని పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఆరోగ్యం మెరుగదల మరియు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రతీరోజూ గ్రౌండు, ప్రాక్టీస్ వదలకూడదన్నారు. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలన్నారు . ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా ఉంటేనే విధుల్లో సమర్థవంతంగా పని చేయడానికి అవకాశం ఉందన్నారు. సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు ఆరోగ్య, విద్య, తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సిబ్బంది నుండీ గ్రీవెన్స్ స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీలు వి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, ఎస్ మహబూబ్ బాషా, పలువురు సి.ఐ లు, ఆర్ ఐ , ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, దితరులు పాల్గొన్నారు