వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశం
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళను పెంచుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా… ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీజీఎస్ కేసులు, వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని… ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు… సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
RELATED ARTICLES