విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోటా స్కూలు వద్ద గల స్థూపం నందు సిఐటియు జెండా ఆవిష్కరణను సిఐటియు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ జే.వి.రమణ, కో కన్వీనర్స్ టి అయూబ్ ఖాన్, ఎల్ ఆదినారాయణ మాట్లాడుతూ మన దేశంలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం ,కార్మిక హక్కులు కాపాడడం కోసం కనీస వేతన చట్టం అమలు కోసం 1970 మే 30 తారీఖున పశ్చిమ బెంగాల్లో జాతీయ కార్మిక సంఘం “సిఐటియు” ఏర్పడినదని అప్పటినుంచి ఇప్పటివరకు నిరంతరం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సిఐటియు సంఘం అని తెలిపారు. భారత దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు అని, ఇటువంటి కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ,ప్రతి కార్మికుడి హక్కుల కోసం పోరాడుతున్న మొనగాడు సంఘం సిఐటియు అని తెలిపారు.కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర.రాష్ట్ర.ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొని వస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా 44 కార్మిక చట్టాలను కేవలం నాలుగు కార్మిక కోడ్ లుగా కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఇటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు కాకుండా సమైక్య పోరాటాలు నిర్వహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో
సిఐటియు నాయకులు ఎస్ హైదర్ వలీ, ఏ మారుతి ,డి చంద్రకళ, పోతక్క, బాబు, చెన్నకేశవులు, ఓలప్ప, రమణమ్మ, బొగ్గు నాగరాజు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES