Sunday, January 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశిక్షణ తరగతుల నిర్వహణ ఎంతో సంతృప్తిని ఇచ్చింది..

శిక్షణ తరగతుల నిర్వహణ ఎంతో సంతృప్తిని ఇచ్చింది..

శ్రీకాళహస్తి ఈటిసి వైస్ ప్రిన్సిపాల్, అబ్జర్వర్ రూపారాణి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ తరగతుల నిర్వహణ నాకెంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని శ్రీకాళహస్తి ఈటిసి వైస్ ప్రిన్సిపాల్, అబ్జర్వర్ రూపారాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు రెండవ రోజు నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులను ఆకస్మికంగా వారు తనిఖీ టీం అంశాలపై శిక్షార్తులను పలు ప్రశ్నలు వేయగా, సరి అయిన సమాధానాలు రావడంతో వారు సంతోషించారు. అంతేకాకుండా ప్రతి అంశముపై వారికి ఎంత మాత్రం అర్థం అయింది అన్న విషయాలపై కూడా ఆరా తీయడంలో సంతృప్తి చెందారు. వచ్చే 2025-26 సంవత్సరం నాటికి మన ధర్మవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నేషనల్ లెవెల్ లో పంచాయితీ అవార్డు పొందడానికి సంకల్పించడం, మీ కృషి ఎంతో స్లాగనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి మనోహర్ తో పాటు, శిక్షార్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు