Homeజాతీయంధర్మస్థల కేసు..ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ హైకోర్టుకెక్కిన ఫిర్యాదుదారులు!

ధర్మస్థల కేసు..ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ హైకోర్టుకెక్కిన ఫిర్యాదుదారులు!

- Advertisement -

ధర్మస్థల సామూహిక ఖననం కేసులో అనూహ్య మలుపు

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలంలో సామూహిక ఖననం జరిగిందంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఆ కార్యకర్తలే ఇప్పుడు తమ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన విచారణలో ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లభించలేదని తెలిసింది. అంతేకాకుండా, స్వాధీనం చేసుకున్న అస్థిపంజరాలపై జరిపిన ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు కూడా ఫిర్యాదుదారుల వాదనలకు విరుద్ధంగా వచ్చాయి. ఈ పరిణామాలతో కేసు పూర్తిగా నీరుగారిపోయింది.ఈ వ్యవహారంలో ఓ జాతీయ మీడియా సంస్థ చేసిన పరిశోధనాత్మక కథనంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నకిలీ విజిల్ బ్లోయర్ గా వ్యవహరించిన సి.ఎన్. చిన్నయ్య అనే వ్యక్తిని గుర్తించగా, ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వాదనల్లోని లోపాలను సదరు మీడియా సంస్థ బయటపెట్టడంతో దర్యాప్తు దిశ మారింది.

ఈ నేపథ్యంలో, ధర్మస్థల పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ అబద్ధాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. ప్రస్తుతం సిట్ అధికారులు ఈ కేసు వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. సంచలన ఆరోపణలతో మొదలైన ఈ కేసు ఇప్పుడు తప్పుడు ఫిర్యాదు, కుట్ర కోణం వైపు మళ్లడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు