విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామంలో అక్రమ సంబంధం విషయంలో ఇరువర్గాల వారు గొడవపడగా ఒక వర్గానికి అదే విధంగా మరొక వర్గానికి చెందిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఒక వర్గానికి చెందిన వారిలో విజయ్, శ్రీనివాసులు, అప్ప స్వామి, లక్ష్మీనారాయణ కాగా మరో వర్గానికి చెందిన బొగ్గు నాగరాజు, దామోదర్, సత్యమయి, ఓబులమ్మ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా బందోబస్తులను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.