Tuesday, June 17, 2025
Homeజిల్లాలుకర్నూలువిద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్టోరియమ్మ ఆధ్వర్యంలో టిడిపి గ్రామ అధ్యక్షులు ముక్కన్న, డీలర్ శ్రీనివాసులు, నాయకులు కంబగిరి, పార్వతమ్మ, ఉరుకుందు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే పేద విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందన్నారు. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులందరికీ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు