Homeఆంధ్రప్రదేశ్ఎల్‌నినో ప్రభావం.. నిండని శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు

ఎల్‌నినో ప్రభావం.. నిండని శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు

- Advertisement -

తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు ఆశించిన స్థాయిలో నీటిని అందించలేకపోయాయి.శ్రీశైలం జలాశయ చరిత్రలో గత 40 ఏళ్లలో ఇంత తక్కువ ప్రవాహాలు నమోదైన సందర్భాలు కేవలం నాలుగుసార్లు మాత్రమే ఉన్నాయి.తుంగభద్ర జలాశయం పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు.రాయలసీమకు సాగు,తాగునీరు అందించే కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఈ రెండు జలాశయాలు అత్యంత కీలకమైనవి.తుంగభద్ర జలాశయం నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసే నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది.సాధారణంగా ఏటా తుంగభద్ర నుంచి సగటున 157 టీఎంసీల నీటిని నది ద్వారా దిగువకు వదులుతారు.శ్రీశైలానికి ముందు పెద్ద రిజర్వాయర్లు లేకపోవడంతో ఈ నీరంతా చివరకు శ్రీశైలానికే చేరుతుంది.

చెరువుల నింపుదలకే ప్రాధాన్యం
అయితే ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా తుంగభద్ర జలాశయం ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో నిండలేదు. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని అంచనా. దీంతో శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసమే నిల్వ చేస్తున్నారు.వచ్చే ఏడాది జూన్‌ ఆఖరు వరకు తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత వర్షాకాలం ఈ సెప్టెంబరు చివరినాటికి ముగియనుంది. ఇప్పటికే భూగర్భజలాలు తీవ్రంగా అడుగంటుతున్నాయి. అక్కడక్కడా ఆరుతడి పంటలు సాగు చేసినప్పటికీ, వాటికి అవసరమైన తడులు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా అధికారికంగా ఎక్కడా సాగును ప్రోత్సహించలేదు.

చెరువుల నింపుదలకే ప్రాధాన్యం
కర్నూలు-కడప కాలువ కింద మూడు జిల్లాల్లో 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలుగుగంగ పథకం కింద స్థిరీకరించిన 1,14,500 ఎకరాల ఆయకట్టుకూ నీరు అందలేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ, హంద్రీ-నీవా ప్రాజెక్టుల కింద కూడా పచ్చదనం కనిపించే పరిస్థితి లేదు. శ్రీశైలం దాటి నాగార్జునసాగర్‌కు చేరిన నీటి పరిమాణం కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అన్ని జలాశయాల కింద తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

తుంగభద్రలో 69 టీఎంసీల నీటి లోటు
ఈ నీటి సంవత్సరంలో తుంగభద్ర జలాశయానికి 183.22 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 110 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఇక గరిష్ఠంగా మరో 4 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం 69 టీఎంసీల నీటి లోటు ఏర్పడినట్లు లెక్కించారు. నీటి కొరత కారణంగా ఈ ఏడాది సాగు సాధ్యపడలేదు. తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ కింద కర్నూలు జిల్లాలోని 1,51,134 ఎకరాల ఆయకట్టులో, హెచ్‌ఎల్‌సీ కింద రాయలసీమలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 2,84,992 ఎకరాల ఆయకట్టులో సాగు జరగలేదు. మరోవైపు, కృష్ణా డెల్టాలో గోదావరి జలాల సాయంతో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు అంచనా.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు