యోగాతోనే ఆరోగ్య రక్షణ సాధ్యం
మోదీ ఆలోచనలకు ప్రతిబింబంగా చంద్రబాబు–పవన్ కళ్యాణ్ యోగాంధ్ర ప్రాజెక్టు
మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; యోగాతోనే జీవిత విధానమును అలవర్చుకోవాలని యోగాతోనే ఆరోగ్య రక్షణ లభిస్తుందని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితర అధికార, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ యోగా కార్యక్రమానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. వారందరికీ యోగ అభ్యసనలు చేయించారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ
యోగా ఆవశ్యకతను చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని ప్రతి ఒక్కరూ యోగా ను జీవిత విధానం గా అలవర్చుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. తదుపరీ మంత్రిమాట్లాడుతూ యోగాంధ్ర మహోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం జిల్లాలోని అనేక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగ ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఈనెల జూన్ 21 నాటికి కనీసం 2 కోట్ల మందికి యోగాసనాలను నేర్పించేందుకు ప్రతి గ్రామం , పట్టణంలోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే సుమారు రెండు కోట్ల 25 లక్షల మంది దాకా రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామం పట్టణంలోనూ యోగాంధ్ర కార్యక్రమాలను జరుగుతున్నందున ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొని విజంతం చేయాలని మంత్రి కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాసనాలను చేరువగా చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోది ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యోగ పై అవగాహన పెంచుకొని యోగాసనాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనితెలిపారు.గత 11 సంవత్సరాల క్రితం దేశ ప్రధాని మోది యోగాను అంతర్జాతీయ దినోత్సవం గా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరడం జరిగిందని, అందువల్లనే ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరపాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరిగే 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో 5 లక్షల మంది దాకా యోగ ఔత్సాహికులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్లు తెలిపారు.11వ యోగా దినోత్సవం మన రాష్ట్రంలోని విశాఖలో నిర్వహించడం ఎంతోసంతోషంగా ఉందన్నారూ. అనంతరం కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో అందరిలోన యోగా దినోత్సవం లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగాబ్యాసంతో ఒత్తిళ్లు దూరమవుతాయని రోజువారి జీవితంలో ఎదురయ్యే వత్తీలను ఎదుర్కొనేందుకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో యోగాంతలకు విశేష స్పందన వస్తోందని ప్రతి ఒక్కరు రోజులో కొంత సమయాన్ని యోగా కోసం కేటాయించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో మే 21 నుండి జూన్ 21 వరకు ప్రతి గ్రామ సచివాలయస్థాయి నుండి జిల్లా పట్టణ కేంద్రం వరకు యోగ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రజలకు యోగ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు ,వ్యాసరచన పోటీలు, పెయింటింగు, క్విజ్, రంగోలి వంటి కార్యక్రమాలను కూడా జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనడం జరుగుతున్నదని పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమమును విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ నేటి సమాజంలో యోగ ఎంతో అవసరమని, మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతమైన మనశ్శాంతిని యోగా మాత్రమే ఇస్తుందని తెలిపారు. పోలీస్ శాఖలో కూడా యోగాను అలవాటు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి ధర్మవరం నకు చెందిన బాపు బాలాజీ శ్రీ లలిత నాట్య మండలి లో చిన్నారులు ప్రదర్శించిన యోగా సాంస్కృతిక నాట్య కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వందలాది మంది భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మహిళా నాయకురాలు జయశ్రీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంబటి అరుణశ్రీ, ఆర్డీవో మహేష్ ,డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ నరసయ్య, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఉదయ భాస్కర్, పర్యాటక శాఖ మేనేజర్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ జిల్లా అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉద్యోగులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ,సామాజిక సేవా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది ,విద్యార్థులు చిన్నారులు మహిళలు , పోలీసు, ఉద్యోగ సిబ్బంది యోగ శిక్షకులు, దాకా యోగ ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.