Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైతులు వంటల విషయంలో సస్యరక్షణ నీటి యాజమాన్యం పై అవగాహన తప్పనిసరి..

రైతులు వంటల విషయంలో సస్యరక్షణ నీటి యాజమాన్యం పై అవగాహన తప్పనిసరి..

రెడ్డిపల్లి శాస్త్రవేత్తల బృందం
విశాలాంధ్ర ధర్మవరం;; రైతులు తమ పంటల విషయంలో సస్యరక్షణతో పాటు నీటి యాజమాన్యంపై తప్పక అవగాహన కలిగి ఉన్నప్పుడే పంటలు దిగుబడి తప్పక వస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి శాస్త్రవేత్తల బృందం తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గొట్టూరు గ్రామంలోవికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని చింతలపల్లి, గొట్లూరు గ్రామాలలో చేపట్టడం జరిగింది.ఇందులో భాగంగా జాహ్నవి ప్రధాన శాస్త్రవేత్త ,వ్యవసాయ పరిశోధన స్థానం రెడ్డిపల్లి వారు వేరుసెనగ, కంది, శెనగ, బత్తాయి పంటలలో వాటిలో వచ్చే చీడ పీడలు వాటి సస్యరక్షణ , నీటి యాజమాన్యం గురించి తెలిపారు. బి. చందన గారు కె వి కె రెడ్డిపల్లి వారు, వారు అందిస్తున్న సేవలు, విత్తనాల లభ్యత, డ్రోన్ ద్వారా పిచికారి తదితర అంశాలను తెలియజేశారు. డా. రఘుకరన్ వారు కోళ్ల, పొట్టేల యాజమాన్య పద్ధతుల, తెలియచేశారు. డాక్టర్ శేఖర్ , వివో ధర్మవరం వారు పథకాల పై తెలియచేశారు. ధర్మవరం మండల వ్యవసాయ అధికారి ముస్తఫా ధర్మవరం మండల వ్యవసాయ అధికారి భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం చేపట్టాలని వాటితో పాటు పథకాలపై రైతులకు సూచించారు. హెచ్ ఓ. అమరేశ్వరీ ఉద్యానవన పథకాల, చిదపిడలపై పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం క్లస్టర్ ఇన్చార్జ్ చింతలపల్లి మహేష్ చౌదరి ,నీటి సంఘాల ప్రెసిడెంట్ కాటమయ్య, నారాయణ , శాస్త్రవేత్తలు జాహ్నవి , ఏ ఆర్ ఎస్ రేకులకుంట, డా. రఘు కరణ్ , ఎల్ఆర్ఎస్ సిద్ధారాపురం, డా. శేఖర్ , వివో కందుకూరు, ఎస్ఎంఎస్. బి.చందన , ఎం ఏ ఓ శ్రీ ముస్తఫా , హెచ్ ఓ అమరేశ్వరీ , రౌతుసేవ కేంద్ర, సచివాలయం సిబ్బంది స్వాతి, అశ్విని , భార్గవ్ .గ్రామ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు