విశాలాంధ్ర -చందర్లపాడు:-నేటి స్పీడ్ యుగంలో డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉంచుకోవటమే గొప్పతనంగా కనిపిస్తుందని ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు వాసిరెడ్డి వంశీ అన్నారు గురువారం మండల పరిధిలోని పున్నవల్లి గ్రామంలో ఆసరా ఫౌండేషన్ మరియు విజయవాడ “లత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” వారి సంయుక్తంగా ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. గుండె పరీక్షలు,ఆయాసం, కొలస్ట్రాల్,బీపి,షుగర్ వంటి వాటితో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.పున్నవల్లి, వెలది కొత్తపాలెం,కొడవటికల్లు గ్రామాల నుంచి మొత్తం 65 మందికి వైద్య పరీక్షలు అందించినట్లు తెలిపారు లత హాస్పిటల్ నుంచి సీనియర్ గుండె వైద్యులు డా|| తబీష్ సయ్యద్ మరియు వారి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన లత హాస్పిటల్ వారికి,గ్రామ యువతకు, ఆసరా సిబ్బందికి సంస్థ అధ్యక్షులు వాసిరెడ్డి వంశీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు…
RELATED ARTICLES