Homeఅంతర్జాతీయంపెరిగిన బంగారం, వెండి ధరలు

పెరిగిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడంతో బులియన్ మార్కెట్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ధర 0.74 శాతం పెరిగి ఔన్సుకు 4,802.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత రెండు సెషన్లలో కోల్పోయిన నష్టాలను చాలావరకు రికవరీ చేసింది. అలాగే, వెండి ధర కూడా 2 శాతం పెరిగి ఔన్సుకు 77.16 డాలర్లకు చేరింది. ఇరాన్ అధికారులు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తమను సంప్రదించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ చట్టాల పరిధిలో శాంతి చర్చలను కొనసాగించడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా సూచించారు. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. ఈ సానుకూల వాతావరణంతో ముడి చమురు ధరలు తగ్గాయి, ఈక్విటీ మార్కెట్లు లాభపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్ల దిగువకు పడిపోయి 96.6 డాలర్ల వద్ద నిలిచింది. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. అయితే, హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనం ఇంకా కొనసాగుతుండటంతో విశ్లేషకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ జరగలేదు. సాయంత్రం 5 గంటల నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు