Wednesday, June 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి

రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద సిఎన్బి కళ్యాణ మండపం సమీపాన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని శాంతినగర్ కు చెందిన నిమ్మూర్తి ఆంజనేయులు ( 43) మృతి చెందాడు. మృతుడు మగ్గాలకు జా కార్డులు కడుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో జా కార్డులు కట్టడానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. తర్వాత సిఎన్బి కళ్యాణ మండపము వద్దకు రాగానే ఎదురుగా ఉన్న మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొని కిందకు పడడం జరిగింది. అందులోనే ధర్మారం వైపు నుంచి ట్రాక్టర్ ఆంజనేయులు పై వెళ్ళింది. దీంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. స్థానికులు సమాచారాన్ని టూటౌన్ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మృతి చెందడంతో భార్యా పిల్లలు బోరున విలపించడం అందరినీ కలిచి వేసింది. మృతునకు భార్య సరోజమ్మ, కుమారులు ఆకాష్ కలరని, ప్రస్తుతం ఆకాష్ విజయవాడలో బిటెక్ చదువుతుండగా రెండవ కుమారుడు అభిరామ్ ఈ సంవత్సరం పదవ తరగతి పూర్తి చేశాడని బంధువులు తెలిపారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు