Thursday, June 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి650-2, సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలను తొలగించాలి

650-2, సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలను తొలగించాలి

అర్హులైన కార్మికులు కు నూతన ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

అన్యక్రాంతం చేసిన వారిపై 420 కేసు నమోదు చేయాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులకు అన్యాయం జరిగింది అని, అర్హులైన కార్మికులకు పట్టాలు ఇవ్వకుండా అనర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి అర్హులైన కార్మికుల్ని రోడ్డున పడేశారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్డిఓ మహేష్ కు, తాసిల్దార్ నటరాజ్ కు వినతి పత్రాన్ని అనంతరం వారు మాట్లాడుతూగత మూడు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది అని, ర్యాలీలు, ధర్నాలు అనేక ఉద్యమాలు చేసిన ఫలిత మే ఈరోజు రెవెన్యూ అధికారులు స్పందించి, కార్మికుల దగ్గరకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని, 650-2 సర్వే నెంబర్ లో అనర్హులైన వారి పట్టాలను రద్దుచేసి ఎవరైతే నిజమైన కార్మికులు ఉన్నారో వారికి వెంటనే పట్టాలు మంజూరు చేస్తామని తెలపడం జరిగిందన్నారు. మొత్తం 76 పట్టాలను ధర్మవరం ఆర్డీవో రద్దు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.కావున మీరు అధికారులు అక్కడ నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి,అన్యాక్రాంతం చేసిన వారిపై 420 కేసులు నమోదు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల కి ఇళ్ల పట్టాలిచ్చి వారికి న్యాయం జరిగే విదంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, నంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, రామసుబ్బయ్య,రామకృష్ణ, సురేంద్ర,నాగేంద్ర,చిన్న, పీరా, జనార్ధన్, మహిళా సమైక్య లీడర్స్ లింగమ్మ,ఈరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు