ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్తి కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; నియోజకవర్గంలోని ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీఏచ్సీ) గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది, ఈ సమస్య వల్ల వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారు.ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి ప్రజల బాగోగులు, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్పందించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ముదిగుబ్బ పీఏచ్సీలో బోర్ వేయించే పనులను ఆదేశించారు. అతి తక్కువ సమయంలోనే బోర్ వేయింపు పూర్తవడం వల్ల ఆసుపత్రిలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమైంది. ఈ చర్యతో వైద్య సిబ్బంది, రోగులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, సమస్యల పరిష్కారంలో ప్రతిస్పందనాత్మకంగా వ్యవహరించే నేతగా సత్యకుమార్ నిరూపించుకుంటున్నారు.
ముదిగుబ్బ పీఏచ్సీకి తక్షణమే నీటి సౌకర్యం
RELATED ARTICLES