Saturday, January 18, 2025
Homeజాతీయందేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఫ్లోర్ మార్కెట్ ఏరియాలో దుండగులు సునీల్ జైన్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతోన్న నేపథ్యంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు