Homeజాతీయం‘హయ్య ఏ1 వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ

‘హయ్య ఏ1 వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ

- Advertisement -

ఖతార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలు ఈ వెబ్ సైట్ ద్వారా తెలియచేయాలి

న్యూదిల్లీ: ఖతార్‌ లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ‘హయ్య ఏ1 వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింక్‌లో వివరాలు నింపాలని ఎంబసీ సూచించింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ ఘర్షణల వేళ.. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో తెలుసుకోవడానికి, వారికి సహాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హయ్య ఏ1 వీసా (Hayya A1 ).. ఖతార్‌లో పర్యటించాలనుకునేవారికి ఇచ్చే సింగిల్ ఎంట్రీ ఎలక్ట్రానిక్ వీసా. దీనిని ‘హయ్య వెబ్‌సైట్‌్ణ లేక ‘హయ్య టు ఖతార్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకుంటారు. ఒకసారి ఈ వీసాను పొందినవారు గడువు ముగిసిన తర్వాత మరో 30 రోజులు పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన ఘర్షణల కారణంగా ఖతార్ నుంచి బయల్దేరాల్సిన విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది భారతీయులు ఆ దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గల్ఫ్‌ దేశాల సహకారంతో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులు నడిపి అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు