Thursday, January 15, 2026
Homeజాతీయంసంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్‌ వోచర్లు

సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్‌ వోచర్లు

- Advertisement -

దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.గత వారం చోటుచేసుకున్న అంతరాయాల వల్ల వేలాది విమానాలు రద్దు కావడం, అనేక విమానాలు భారీగా ఆలస్యమవడం వంటి కారణాలతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల విలువైన ప్రత్యేక ట్రావెల్‌ వోచర్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.అయితే, ఈ సదుపాయం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.రాబోయే 12 నెలల్లో ఇండిగోతో చేసే ఏ దేశీయ ప్రయాణానికైనా ఈ వోచర్లను వినియోగించుకోవచ్చని సంస్థ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.

ఇండిగో అధికారికంగా క్షమాపణలు
విఘాతం చోటుచేసుకున్న రోజుల్లో అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల కొద్దీ చిక్కుకుపోయిన విషయాన్ని కంపెనీ అంగీకరించింది.వారికి కలిగిన అసౌకర్యంపై ఇండిగో అధికారికంగా క్షమాపణలు కూడా తెలిపింది.దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో, ప్రస్తుతం తన కార్యకలాపాల్లో ఇంత పెద్ద స్థాయిలో అంతరాయం ఏర్పడడం ఇదే తొలిసారి.గత పది రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు రద్దవ్వడం, షెడ్యూల్ మార్పులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటికే పలు విమానాలపై కోతలు విధించే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు