గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో తెలుగు పద్యాల పై ఎంతైనా ఆసక్తి అవసరము అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలియజేశారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు యోగ, ఆటల విషయంలో మంచి మెలకువలను తెలుసుకోవాలని తెలియజేశారు. భారతదేశంలో పూర్వకాలము నుండి తెలుగు పద్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని, అదేవిధంగా ప్రభుత్వం కూడా తెలుగు పాఠ్యాంశమును ఇవ్వడం జరిగిందన్నారు. తెలుగు విషయంలో ఉన్నంత తృప్తి ఏ ఒక్క భాషలో కూడా లేదని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించామని ఇందులో యోగా, తెలుగు, ఇంగ్లీష్, వ్యాకరణం, గ్రామర్, నాట్యాలు, వివిధ ఆటలు వల్ల చక్కటి ఆరోగ్యము, శరీర దృఢత్వం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని తెలిపారు.
ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
తెలుగు పద్యాల పై ఆసక్తి చాలా అవసరం..
RELATED ARTICLES