Homeఆంధ్రప్రదేశ్మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వారు మౌనంగా ఉండటం దారుణం

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వారు మౌనంగా ఉండటం దారుణం

- Advertisement -

: అంబటి రాంబాబు
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్రంలోని పలు ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా, ఆయనను ఇంకా చైర్మన్ పదవిలో కొనసాగించడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, నెటిజన్లు విమర్శిస్తున్నా సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ నాయుడు తన పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎంలు మౌనంగా ఉండటం దారుణమని అన్నారు. తప్పులను ఎత్తి చూపుతున్న తమపై దాడులు చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు