విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య మండలి విశ్వవిద్యాలయంలో ఖాళీలు వివరాలు, రిజర్వేషన్ రోస్టర్ విధానాలు , నిబంధనలు పాటిస్తూ చేపట్టవలసిన మార్గదర్శకాలను కీలక సమాచారాన్ని సేకరించారు. మంగళవారం విజయవాడలో ఉన్నత విద్యా మండలి అధ్యాపక నియామక పై వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఎస్ కృష్ణయ్య సమీక్షించారు. గత ప్రభుత్వం అధ్యాపక పోస్టుల భర్తీ నియామకం పై కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, నియామక ప్రక్రియకు ఎదురవుతున్న అడ్డంకులు మొదలగు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల భర్తీకి.. ప్రభుత్వం సన్నదత అవుతూ ఉండడం పట్ల.. నిరుద్యోగ అభ్యర్థులు వర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియామక ప్రక్రియ ఎటువంటి అడ్డంకులకు చోటు చేసుకోకుండా పటిష్టమైన మార్గదర్శకాలను, నియామక ప్రక్రియను చేపట్టనున్నది.