ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ/పీజీ కళాశాలలో ఈ నెల 31 వ తేదీన ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అమెజాన్ వేర్హౌస్ మేనేజ్మెంట్, ఆల్ డిజి కంపెనీలు జాబ్ మేళాకు సహకరిస్తున్నాయని తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరములలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అన్ని డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కలదని తెలిపారు. బయోడేటా తో కళాశాలలో సంప్రదించారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
శ్రీనివాస డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహణ..
RELATED ARTICLES