సిపిఐ జిల్లా కార్యదర్శి యం. వేమయ్య యాదవ్
విశాలాంధ్ర -కదిరి; కదిరి సిపిఐ కార్యాలయం నందు పత్రికా విలేకరులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యం. వేమయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో 3,సెంట్లు పట్టణ ప్రాంతాలలో 2,సెంట్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం మంజూరు చేయాలని అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేయాలని జూన్ 2,వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో విజయవంతం అయ్యేలా చొరవ చూపాలని నాయకత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కదిరి డివిజన్ కార్యదర్శి నల్లజోడు పవన్ కుమార్ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మధు నాయక్ పట్టణ కార్యదర్శి లియాకత్ ఆలీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ రమణ, రైతు సంఘం సహాయ కార్యదర్శి చంద్ర, సిపిఐ టౌన్ సహాయ కార్యదర్శి అదేప్ప తదితరులు పాల్గొన్నారు.
ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
RELATED ARTICLES