Homeజాతీయందేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె

- Advertisement -

ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా జరుగుతున్న మందుల విక్రయాలు, భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఫార్మసీలు నేడు బంద్‌ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు ఈ 24 గంటల సమ్మెను చేపట్టారు. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా ఫార్మసిస్ట్‌లు, మందుల పంపిణీదారులు తమ కార్యకలాపాలను నిలిపివేశారు.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆన్‌లైన్ మందుల విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని, అక్రమమని ఏఐఓసీడీ జాతీయ అధ్యక్షుడు జేఎస్ షిండే ఆరోపించారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఎస్ఆర్‌ 817 నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ, ప్రస్తుత ఆన్‌లైన్ అమ్మకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఁఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలపై ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మేము మా వ్యతిరేకతను తెలిపాము. సరైన నియంత్రణ లేకపోతే ఈ వ్యవస్థ మాఫియా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించాము. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ముందుగా పటిష్ఠమైన ఐటీ మౌలిక సదుపాయాలు అవసరమని ప్రభుత్వానికి సూచించాముఁ అని షిండే వివరించారు.

ఈ సమ్మె సందర్భంగా ఏఐఓసీడీ ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. అవి: 1. ఆన్‌లైన్ ఫార్మసీలకు సంబంధించి జారీ చేసిన జీఎస్ఆర్‌ 817 నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి, మందుల విక్రయాలకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి. 2. కరోనా మహమ్మారి సమయంలో తీసుకొచ్చిన జీఎస్ఆర్‌ 220 నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి. 3. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఇస్తున్న భారీ డిస్కౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఈ డిమాండ్లపై షిండే మరింత స్పష్టతనిచ్చారు. ఁఒకవేళ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం కొనసాగిస్తే, మాలాంటి ఆఫ్‌లైన్ కెమిస్ట్‌లకు కూడా పోటీపడే అవకాశం కల్పించాలి. ఇందుకోసం డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ)ను సవరించి, మాకు అధిక మార్జిన్లు ఇవ్వాలి. అప్పుడే మేము కూడా వినియోగదారులకు ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వగలంఁ అని ఆయన అన్నారు.

అత్యవసర సేవలకు అంతరాయం లేదు
దేశవ్యాప్త బంద్ జరుగుతున్నప్పటికీ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర మందుల సేవలను కొనసాగిస్తామని ఏఐఓసీడీ హామీ ఇచ్చింది. ఁప్రజలకు అత్యవసర మందులు అవసరమైతే అందించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు అని షిండే భరోసా ఇచ్చారు. ఈ నిరసనతో దేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీల మధ్య నియంత్రణ, వ్యాపార కార్యకలాపాలపై జరుగుతున్న చర్చ మరోసారి తీవ్రస్థాయికి చేరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు