Wednesday, June 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంయోగాతో మానసిక ఆరోగ్యం

యోగాతో మానసిక ఆరోగ్యం

జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ నాయుడు
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లా రవాణా శాఖ ప్రాంగణం లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం యోగాంధ్ర కార్యక్రమం రవాణా శాఖ యోగ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ నాయుడు మాట్లాడుతూ… ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ కార్యక్రమాన్నిప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగిందని , అందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగ చేసుకొని శారీరక ,మానసిక ఆరోగ్యం పొందాలని కోరారు –
ఈ కార్యక్రమంలో ,ముఖ్య అతిథిగా పాల్గొన్న డి యం హెచ్ ఓ ,యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డా .ఈబి దేవి , రవాణా శాఖ అధికారులు కళ్యాణదుర్గం ఆర్ టి ఓ రమేష్ , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాసులు , డి శ్రీనివాసులు ,రాజగోపాల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ కె వి ఎల్ న్ ప్రసాద్ , జే శ్రీనివాస్ ,లహరి ,మనోహర్ రెడ్డి ,రఘు ,శ్వేత బిందు , ట్రాస్పోర్ట్ కాన్స్టేబుల్స్ నరసింహులు , చలపతి , నంద్యాల వై సి టి యోగ మాస్టర్స్ రామకృష్ణ రెడ్డి,రమ్య . బ్రహ్మకుమారీ శారద పాల్గొని యోగాసనాలు చేయించారు.
ఈ సందర్భంగా డి యం హెచ్ ఓ ,యోగాంధ్ర నోడల్ అధికారి డా ఈ బి దేవి మాట్లాడుతు అధికారులు సిబ్బంది , అందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమని , ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం తో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యోగా కార్యక్రమాన్ని ఒక నెల రోజులు పాటు నిర్వహించి ప్రజలందరికి నిత్య జీవితం లో యోగ ఒక భాగం చేయాలని ,ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అములు చేయుచున్నావని ,అందరూ యోగాను సాధన చేయాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అధికారులు డా.రామ్ కుమార్, డా.లాల్యా నాయక్ డెమో త్యాగరాజ్ ,డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ ,పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు