సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : యోగాతో శ్వాస, శక్తి, ప్రశాంతకలుగుతుందని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు.11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలలో భాగంగా బుధవారం మండలకేంద్రం అయిన వలేటివారిపాలెం జిల్లాప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిడిఓ నరేంద్ర దేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంద్ర డే కార్యక్రమంనకు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో ఒత్తిడికి గురవుతారని ఒత్తిడి నుండి విముక్తి పొందాలంటే యోగ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.యోగా మనిషి జీవితంలో ఒక భాగం కావాలని,సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని తెలిపారు. యోగా సాధనలో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతం నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రజలకు యోగా పై అవగాహన కలిగించి అందరూ ప్రతి రోజూ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నరేంద్ర దేవ్, గుడ్లూరు సీ ఐ మంగారావు, ఎస్ ఐ మరిడి నాయుడు, ఏఎస్ఐ బ్రహ్మయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు ఇస్సాక్,యోగా ఉపాధ్యాయుని శ్రీలత, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, వెలుగు సిబ్బంది, పీల్డ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.