Homeఆంధ్రప్రదేశ్అమరావతి-2.0 మాస్టర్‌ప్లాన్‌కు వేగం.. 22 వారాల్లో రెండో దశ ప్రణాళిక సిద్ధం

అమరావతి-2.0 మాస్టర్‌ప్లాన్‌కు వేగం.. 22 వారాల్లో రెండో దశ ప్రణాళిక సిద్ధం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణలో కీలకమైన రెండో దశ మాస్టర్‌ప్లాన్‌ను 22 వారాల్లో సిద్ధం చేసి అందజేస్తామని సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అమరావతి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సమీకృత మాస్టర్‌ప్లాన్‌ను ఈ సంస్థ రూపొందిస్తోంది.గత రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసింది.ఈ సందర్భంగా అమరావతి-2.0 రూపకల్పనకు సంబంధించిన ప్రణాళికలు, పురోగతిపై విస్తృతంగా చర్చించారు.

మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా కీలక అంశాలు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రజలు నివసించేందుకు అనువుగా, అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్రబిందువుగా,ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన ఆధునిక నగరంగా రాజధానిని తీర్చిదిద్దేలా అమరావతి-2.0 మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులకు,సింగపూర్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.సమావేశంలో సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి,అమలు విధానం, దశలవారీ కార్యాచరణపై ముఖ్యమంత్రికి సమగ్ర వివరాలు అందించారు.ఏరియా ప్లానింగ్, మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, ప్రజా సదుపాయాలు, పెట్టుబడుల నమూనా వంటి కీలక అంశాలను మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఆధునిక మౌలిక వసతులతో కూడిన రాజధాని
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వంటి కీలక రహదారి ప్రాజెక్టులతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక మౌలిక వసతులతో కూడిన రాజధానిని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో పాటు ఆర్థిక శాఖ, పురపాలక శాఖ, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు