పునరావాస కేంద్రాన్ని సందర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి
విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మొంథా తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .. అనంతరం పునరావేస కేంద్రంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సందర్శించి నిర్వాసితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుకున్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మజీ రమణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను దొడ్డి అప్పలరాజు, గోల్కొండ సత్యనారాయణ, వీఆర్వో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


